News February 23, 2025

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు ప‌టిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

ఈ నెల 27న జ‌రిగే కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు జిల్లా స్థాయిలో ప‌టిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ జి.ల‌క్ష్మీశా తెలిపారు. ఎన్నిక‌ల జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ వి.క‌రుణ‌.. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జిల్లాల క‌లెక్ట‌ర్లు, స‌హాయ రిట‌ర్నింగ్ అధికారుల‌తో శ‌నివారం వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఏర్పాట్ల‌ను వివ‌రించారు.

Similar News

News November 8, 2025

అవినీతి ఆరోపణలపై బాన్సువాడ కానిస్టేబుల్ సస్పెండ్

image

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాన్సువాడ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ భుక్య శ్రీనును ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం సస్పెండ్‌ చేశారు. కోర్టు కేసులకు సంబంధించి వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలడంతో చర్యలు తీసుకున్నారు. శాఖలో అనైతిక చర్యలు, అవినీతి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News November 8, 2025

కర్నూలు-వైజాగ్‌కు ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభం

image

కర్నూలు నుంచి వైజాగ్‌కు 3 నూతన ఏసీ బస్సు సర్వీసులను కర్నూలులో మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసుల వల్ల రెండు ప్రాంతాల్లో టూరిజం డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని మంత్రి అన్నారు. ఇక బస్సు ప్రమాదాలు జరగడం ఎంతో బాధాకరమని, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ బస్సులో ఉంటే ఇటీవల కర్నూలులో బస్సు ప్రమాదం జరిగేది కాదని అన్నారు. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.

News November 8, 2025

GDK: MLA ప్రమేయంతోనే గుడులను కూల్చివేశారు

image

రామగుండం MLA- MS రాజ్ ఠాకూర్ ప్రమేయంతోనే గ్రామ దేవతల ఆలయాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారని నియోజకవర్గ BJP ఇన్చార్జి కందుల సంధ్యారాణి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూల్చివేతకు బాధ్యులైన అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కూల్చివేసిన గుడుల స్థానంలోనే తిరిగి పునర్ నిర్మించాలన్నారు.