News February 26, 2025

ఎమ్మెల్సీ ఓటర్లకు సిద్దిపేట సీపీ సూచనలు

image

పట్టబద్రులు, టీచర్లు పోలీసుల సలహాలు, సూచనలు పాటించి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించామని, కావున గుంపులు గుంపులుగా తిరగవద్దని సీపీ సూచించారు.

Similar News

News November 27, 2025

KMR: పీహెచ్సీ వైద్యాధికారులతో డీఎంహెచ్వో సమీక్ష

image

కామారెడ్డి కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో డీఎంహెచ్వో డా.విద్య సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు వివరాలను, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై సమీక్షించారు. గర్భిణులకు, చిన్న పిల్లలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు సమయానుసారంగా అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News November 27, 2025

HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

image

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.

News November 27, 2025

కరీంనగర్: ఈ రెండు గ్రామాలకు ఎన్నికలు లేవు..!

image

KNR(D) సైదాపూర్(M) రామచంద్రాపూర్, కురుమ పల్లె గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు సమయంలో రెండు గ్రామాల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటివరకు హైకోర్టులో తుది తీర్పు వెలువడలేదు.