News November 22, 2024
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రశ్న.. గందరగోళంగా మారిన సభ

వైసీపీ హయాంలో అమలు చేసిన ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఇప్పుడేమైనా ఇస్తారా? అని YCP ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి శాసనమండలిలలో ప్రశ్నించారు. దీనిపై మంత్రి సవిత మాట్లాడుతూ.. ‘మేము అగ్రవర్ణ పేదల అభివృద్ధికి కృషిచేస్తున్నాం. వైసీపీ వారిని పట్టించుకోలేదు. బటన్ నొక్కడమే తప్ప ఉపాధి కల్పించలేదు. దీంతో గంజాయికి అలవాటు పడ్డారు’ అని అనడంతో YCP నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
Similar News
News February 28, 2026
’60 ఏళ్ల స్నేహం’ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కంటతడి

రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కమాలుద్దీన్తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ “మంచి మిత్రుడిని కోల్పోయాను” అని కంటతడి పెట్టారు.
News February 28, 2026
సిద్ధవటంలో చిరుత సంచారం

సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.
News February 28, 2026
కడప: ఇద్దరు MEOలు సస్పెండ్

ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.


