News March 18, 2025
ఎర్రగుంట్లలో ప్రమాదం.. సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఇవాళ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం చెందారు. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 24, 2025
చేవెళ్ల ప్రమాదం.. ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్

TG: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద NOV 3న RTC బస్సు-టిప్పర్ ఢీకొన్న <<18212535>>ఘటనలో<<>> టిప్పర్ డ్రైవర్ సహా18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో టిప్పర్ ఓనర్ లచ్చు నాయక్ను పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడిగా చేర్చారు. టిప్పర్ ఓవర్ లోడే ప్రమాదానికి కారణమని, ఆ సమయంలో అతడు టిప్పర్లోనే ఉన్నాడని తేల్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన లచ్చు నాయక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
News December 24, 2025
మాల్యా భారత్కు ఎప్పుడు వస్తారు: బాంబే హైకోర్టు

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “భారత్కు ఎప్పుడు వస్తారు?” అనేది రాతపూర్వక అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. విదేశాల్లో ఉంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. నేర విచారణ నుంచి తప్పించుకుని.. విదేశాల్లో ఉంటూ చట్టాన్ని సవాలు చేయడం సరికాదని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
News December 24, 2025
హైకోర్టుల్లో కేసుల విచారణ ఇలా!

హైకోర్టుల్లో కేసుల విచారణ క్రమ పద్ధతిలో జరుగుతుంది. TG HCలో 32, APలో 23 హాళ్లున్నాయి. హాల్-1లో CJ పిల్, రిట్ పిటిషన్లను విచారిస్తారు. 2-3 జడ్జిలుండే డివిజన్ బెంచ్లు(H2-10) క్రిమినల్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్ కేసులను చేపడతాయి. మిగిలిన హాళ్లలో సింగిల్ బెంచ్లు సివిల్, క్రిమినల్, బెయిల్ పిటిషన్ల వాదనలు వింటాయి. ఈ కేసులే విచారించాలనేది ఫిక్స్ కాదు. <


