News March 18, 2025
ఎర్రగుంట్లలో ప్రమాదం.. సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఇవాళ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం చెందారు. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 11, 2026
ఇరాన్పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్లో నిరసనలు తీవ్రమవుతున్న వేళ ఆ దేశంలో సైనిక చర్య చేపట్టే అవకాశాలపై ట్రంప్కు అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారని NYT పేర్కొంది. టెహ్రాన్లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, కీలక నేతల సెక్యూరిటీ నెట్వర్క్ను టార్గెట్ చేస్తూ దాడులు చేసే ఆప్షన్స్ను పరిశీలించారని తెలిపింది. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని, US వారికి సాయం చేయడానికి రెడీగా ఉందని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News January 11, 2026
విశాఖ: 20 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖ జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) మొత్తం 20 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. టైప్-3 విభాగంలో 06, టైప్-4 విభాగంలో 14 నాన్ టీచింగ్ పోస్టింగ్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు.
News January 11, 2026
అనకాపల్లి: 83 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనకాపల్లి జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) మొత్తం 83 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది.. టైప్-3 విభాగంలో 20, టైప్-4 విభాగంలో 63 పోస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు.


