News January 4, 2025
ఎర్రవల్లి: ప్రజలకు ఉత్తమ సేవలదించాలి: ఐజీ
కొత్తగా విధుల్లో చేరే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలందించి డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ సూచించారు. హైదరాబాద్, నిజామాబాద్, ములుగు జిల్లాల నుంచి కానిస్టేబుల్స్గా ఎంపికైన వారు ఎర్రవల్లి పదో బెటాలియన్లో 9 నెలలు శిక్షణ పూర్తి చేశారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 26, 2025
MBNR: 108 ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ ఈఎంటీ రాజేందర్, పైలెట్ శ్రీనివాసులు, జడ్చర్ల మండలంలోని 108 పైలట్ రాంరెడ్డి, అడ్డకల్ అంబులెన్స్ ఈఎంటీ నాగరాజు, పైలట్ కిషోర్ ఉత్తమ ఉద్యోగి అవార్డుకు ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ప్రశంసా పత్రాల్ని అందించారు.
News January 26, 2025
జడ్చర్ల: లచ్చన్న దళం పేరుతో.. ఎమ్మెల్యేకి మావోయిస్టుల లేఖ
రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు లచ్చన్న దళం మావోయిస్టుల పేరుతో లేఖను అతికించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటికి మరోసారి లచ్చన్న దళం పేరుతో లేఖ రాశారు. ‘ఎమ్మెల్యేగా మంచిగా వ్యవహరించు.. గర్వం ఉంటే ఎప్పటికీ మంత్రి కాలేవు. దయచేసి జాగ్రత్తగా ఉండు. ఇట్లు లచ్చన్న దళం’ అంటూ లేఖలో ఉంది.
News January 26, 2025
MBNR: సంక్షేమ పథకాల అమలకు నేడే శ్రీకారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.