News March 15, 2025

ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పులు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎర్రుపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మొలుగుమాడుకి చెందిన తోట వెంకటేశ్వరరావు అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంతో పాటు మరో 5ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశాడు. పంట సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 29, 2025

భారీ వర్షాలు.. ఖమ్మం సీపీ కీలక సూచనలు

image

ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సీపీ సునీల్ దత్ సూచించారు. నీట మునిగిన రోడ్లు, వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని, సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100, 1077 లేదా 87126 59111 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చెరువులు, వాగుల వద్ద పోలీసులు పహారా పెంచారని ఆయన పేర్కొన్నారు.

News October 29, 2025

ఖమ్మం: పత్తి మార్కెట్‌కి సెలవు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డుకు నేడు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. అపరాలు, మిర్చి కొనుగోళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. పత్తి క్రయవిక్రయాలు తిరిగి ఈ నెల 30న గురువారం పునఃప్రారంభమవుతాయని తెలిపారు. పత్తి విక్రయానికి రానున్న రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 29, 2025

ఖమ్మం జిల్లాలో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.