News April 3, 2025

ఎలక్ట్రానిక్ పరికరాల బహిరంగ వేలం

image

రాచకొండ కమిషనరేట్‌ పరిధి అంబర్‌పేటలోని CAR పరేడ్ గ్రౌండ్, హెడ్ క్వార్టర్స్‌లో వస్తువులను బహిరంగ వేలం నిర్వహించాలని రాచకొండ కమిషనరేట్ నిర్ణయించింది. టేబుల్స్, కుర్చీలు, UPS బ్యాటరీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, బారికేడ్‌లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు, బొల్లార్డ్‌లు మొదలైన వస్తువులను సొంతం చేసుకోవాలనుకున్నవారు. ఈ నెల 4న ఉ.10.30 గంటలకు వేలంలో పాల్గొనవచ్చు. # SHARE IT

Similar News

News April 11, 2025

26/11 అటాక్‌లో హైదరాబాద్ ప్రస్తావన

image

ముంబై ఉగ్రదాడి నిందితుడు రాణాను ఎట్టకేలకు ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో HYDకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా.. అజ్మల్ కసబ్ దగ్గర నాగోల్ చిరునామా, అరుణోదయ కాలేజీ పేరు ఉన్న బోగస్ ఐడీలు బయటపడ్డాయి. ఆ కార్డుల్లో నగర చిరునామాలు ఉండటంతో ముంబై పోలీసులు HYD చేరుకుని దర్యాప్తు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘HYD’ అనే ఉగ్రవాదుల వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిపుణుల భాషా విశ్లేషణతో వారు పాక్ అని తేలిపోయింది.

News April 11, 2025

శంషాబాద్ విమానాశ్రయానికి 56వ స్థానం

image

ప్రపంచంలోని టాప్ 100 విమానాశ్రయాల జాబితాలో మన దేశంలోని 4 విమానాశ్రయాలకు స్థానం దక్కింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రావెల్ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 56వ స్థానంలో నిలవగా.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం 32వ స్థానంలో నిలిచింది.

News April 11, 2025

HYD: జిమ్ ట్రైనర్ హత్య.. నిందితుల రిమాండ్

image

బోడుప్పల్‌లో జిమ్ ట్రైనర్‌ మర్డర్‌ కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఇందిరానగర్‌కు చెందిన చంటి భార్యతో జిమ్ ట్రెయినర్ సాయికిషోర్‌ చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. దీంతో పుట్టింటికి వెళ్లింది. కక్షగట్టిన చంటి మర్డర్‌కు ప్లాన్ చేసి స్నేహితులు ధ్రువకుమార్‌సింగ్, శ్రీకాంత్, సాయికిరణ్‌‌తో కలిసి జిమ్‌లోనే అతడిపై డంబెల్‌తో దాడిచేయగా మృతిచెందాడు. రాత్రి నిందితులను రిమాండ్ చేశారు.

error: Content is protected !!