News April 3, 2025
ఎలక్ట్రానిక్ పరికరాల బహిరంగ వేలం

రాచకొండ కమిషనరేట్ పరిధి అంబర్పేటలోని CAR పరేడ్ గ్రౌండ్, హెడ్ క్వార్టర్స్లో వస్తువులను బహిరంగ వేలం నిర్వహించాలని రాచకొండ కమిషనరేట్ నిర్ణయించింది. టేబుల్స్, కుర్చీలు, UPS బ్యాటరీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, బారికేడ్లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు, బొల్లార్డ్లు మొదలైన వస్తువులను సొంతం చేసుకోవాలనుకున్నవారు. ఈ నెల 4న ఉ.10.30 గంటలకు వేలంలో పాల్గొనవచ్చు. # SHARE IT
Similar News
News November 28, 2025
HYD: నేడు, రేపు డిగ్రీ కోర్సుల తుది కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది దశ కౌన్సిలింగ్ ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సుల భర్తీకి సంబంధించింది. ప్రస్తుతం రైతు కోటాలో 22 సీట్లు, రైతు కూలీల కోటాలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News November 28, 2025
శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.
News November 27, 2025
RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్నగర్ నియోజకవర్గం, శంషాబాద్లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.


