News March 12, 2025
ఎలక్ట్రికల్ పోల్ పడి కే.కోటపాడు వ్యక్తి మృతి

గాజువాక సమీపంలో గల నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం RTC బస్సు ఎలక్ట్రికల్ పోల్ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో K.కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలవ్వగా స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 6, 2025
NTR: వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు

KRU పరిధిలోని కళాశాలలలో పీజీ కోర్సులలో వేకెంట్ సీట్ల భర్తీకై ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని వర్సిటీ డైరెక్టర్ డా.ఎల్. సుశీల తెలిపారు. ఏపీ పీజీసెట్-2025 రాసి క్వాలిఫై కానివారు, ఆ పరీక్ష రాయనివారు స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చని, ప్రభుత్వ నిబంధనల మేరకు వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించదన్నారు. DEC 8న ఉదయం 10 గంటలకు KRU క్యాంపస్లో సంప్రదించాలన్నారు.
News December 6, 2025
వంటింటి చిట్కాలు

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.
News December 6, 2025
GNT: మంత్రి నారా లోకేశ్పై అంబటి ట్వీట్

మంత్రి నారా లోకేశ్పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘X’లో సెటైరికల్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మంత్రి లోకేశ్ చంద్రబాబు ప్లేటును తీస్తున్న ఓ ఫొటో షేర్ చేసి, ఇప్పుడు నువ్వు “తిన్న ప్లేటు” రేపు నువ్వు “కూర్చున్న సీటు” తీసేయడం కాయం.! అంటూ క్యాప్షన్ ఇచ్చి చంద్రబాబు, లోకేశ్లకు ట్యాగ్ చేశారు.


