News February 1, 2025
ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి: CP

ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సూచించారు. పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించి (2023, 2024, 2025 అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఏసీపీ, సీఐలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 7, 2025
విశాఖలో 10 విమానాల రద్దు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

ఇండిగో సంక్షోభం ప్రభావంతో విశాఖ నుంచి సండే 10 ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. దీంతో కనెక్టింగ్ ఫ్లైట్ల ప్రయాణీకులు గంటల తరబడి ఎయిర్పోర్టులో చిక్కుకుపోయారు. రద్దు వల్ల విశాఖ-HYD టికెట్ ధరలు రూ.6వేల నుంచి రూ.18 వేలకి పెరిగాయి. మ్యాచ్ కోసం వచ్చిన వాళ్లు, అయ్యప్ప భక్తులు, విదేశీయులు ఇబ్బందిపడుతున్నారు. పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ట్రావెల్ అసోసియేషన్లు హెచ్చరించాయి.
News December 7, 2025
జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్

TG: ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ వేడుకల్లో భాగంగా ఎల్లుండి ఉ.10 గంటలకు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్లోనూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
News December 7, 2025
NLG: అప్పుల్లో మునిగిన తెలంగాణ: కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ఆరోపణ

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లో ముంచిందని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాల అవినీతి పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. భూముల అమ్మకాలతోనే ప్రభుత్వం నెట్టుకొస్తుందని, గ్యారంటీలు ఏ వర్గానికి ఉపయోగపడలేదని దుయ్యబట్టారు.


