News January 31, 2025
ఎలమంచిలి: చెక్ బౌన్స్ కేసులో డీటీకి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో ఎలమంచిలి డిప్యూటీ తహశీల్దార్ టీ.హనుమాన్ వినయ్ కుమార్కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.9.05 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. 2019 నవంబర్ 14న టి.పద్మావతి దగ్గర డీటీ రూ.12 లక్షలు అప్పుగా తీసుకుని 2022న మార్చి 2న అప్పు తీర్మానం నిమిత్తం చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Similar News
News November 22, 2025
రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్ను ఇస్తుందని సూచించారు. SHARE IT
News November 22, 2025
ADB: ఈ నెల 24న జిల్లాకు మంత్రి జూపల్లి రాక

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ నెల 24న పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం రోడ్డు మార్గాన జిల్లాకు చేరుకొని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బోథ్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అక్కడి నుండి నిర్మల్ జిల్లాకు వెళతారు.
News November 22, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అబ్జర్వర్గా నవీన్ కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పంతంగిలో జరగబోయే అండర్ – 17 బాలబాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను పర్యవేక్షించడానికి జడ్.పి.హెచ్.ఎస్ భూషణరావుపేట ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వీ. నవీన్ కుమార్ను రాష్ట్ర ఎస్ జీ ఎఫ్ క్రీడల అధికారిని ఉషా రాణి నియమించారు. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ వారు అభినందించారు.


