News January 31, 2025
ఎలమంచిలి: చెక్ బౌన్స్ కేసులో డీటీకి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో ఎలమంచిలి డిప్యూటీ తహశీల్దార్ టీ.హనుమాన్ వినయ్ కుమార్కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.9.05 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. 2019 నవంబర్ 14న టి.పద్మావతి దగ్గర డీటీ రూ.12 లక్షలు అప్పుగా తీసుకుని 2022న మార్చి 2న అప్పు తీర్మానం నిమిత్తం చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Similar News
News December 4, 2025
తిరుపతి: విద్యార్థులు.. విజ్ఞాన.. విహార యాత్రలు

పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన.. విహార యాత్రల నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 44 పాఠశాల్లోని 8, 9 తరగతి విద్యార్థులు 6809 మందిని తీసుకెళ్తున్నారు. ఈనెల 10వ తేదీ లోపు శ్రీహరికోట, జూపార్క్, రీజనల్ సైన్స్ సెంటర్, చంద్రగిరి కోట ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి రూ.500 కేటాయించింది.
News December 4, 2025
జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయాలని కేంద్రమంత్రికి వినతి

ఏలూరులో మూతపడిన జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఏలూరు, కొత్తూరులోని శ్రీకృష్ణ జూట్ మిల్స్కు చెందిన 2యూనిట్లు అకస్మాత్తుగా మూసివేయబడ్డాయి. దీంతో దాదాపు 5,000 మంది కార్మికులు నిరుద్యోగులుగా మారి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కార్మిక సంఘాల నేతలు ఇటీవల ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
News December 4, 2025
GHMC మెగా విలీనంపై అడ్డంకులు.. మరో ఏడాది HMDA నిబంధనలే!

విశాలమైన GHMC ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనా క్షేత్రస్థాయిలో పాలనా ప్రణాళికకు అడ్డంకులు తప్పడం లేదు. 27 ULBsను విలీనం చేసినప్పటికీ పౌరులకు ఏకరూప నిబంధనలు ఇప్పట్లో అందుబాటులోకి రావు. విలీన ప్రాంతాల్లో ప్రస్తుత HMDA మాస్టర్ ప్లాన్ 2013 జోనల్ నిబంధనలే ఇంకో ఏడాది పాటు అమలులో ఉంటాయి. సంక్లిష్టమైన రూల్స్ను ఏకీకృతం చేయడంలో అధికారుల జాప్యం కారణంగా కొత్త GHMC, HMDA మాస్టర్ ప్లాన్ 2031 ఆలస్యం కానుంది.


