News January 31, 2025
ఎలమంచిలి: చెక్ బౌన్స్ కేసులో డీటీకి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో ఎలమంచిలి డిప్యూటీ తహశీల్దార్ టీ.హనుమాన్ వినయ్ కుమార్కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.9.05 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. 2019 నవంబర్ 14న టి.పద్మావతి దగ్గర డీటీ రూ.12 లక్షలు అప్పుగా తీసుకుని 2022న మార్చి 2న అప్పు తీర్మానం నిమిత్తం చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Similar News
News October 17, 2025
క్రాకర్స్ దుకాణాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ జగదీశ్

క్రాకర్స్ విక్రయలకు అనుమతులు తప్పనిసరని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి షాపులో అగ్నిమాపక పరికరాలు ఉండాలని, షాపుల మధ్య దూరం పాటించాలని తెలిపారు. షెడ్లు ప్రమాదకరంగా ఉండకూడదన్నారు. విద్యుత్ సరఫరా భద్రంగా ఉండేలా సర్టిఫైడ్ ఎలక్ట్రిషన్తో పనిచేయాలని సూచించారు.
News October 17, 2025
కొత్తగూడెం: మద్యానికి బానిసై యువకుడి SUICIDE

మద్యానికి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చుంచుపల్లి మండలం గౌతంపూర్ ఏరియాలో గురువారం చోటుచేసుకుంది. సంకువార్ కార్తీక్(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయాడని 2 టౌన్ సీఐ ప్రతాప్ తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మనీషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News October 17, 2025
హనుమకొండలో ప్రారంభమైన అథ్లెటిక్ పోటీలు

HNKలో రెండో రోజు అథ్లెటిక్స్ ప్రారంభమయ్యాయి. నేడు 500 మీటర్ల పరుగు, 119 మీటర్ల హర్డిల్స్ (1.067 మీటర్లు), ట్రిపుల్ జంప్ (13.00 డిస్కస్ త్రో, (2.000 kg), 100 మీటర్ల (0.83 మీటర్లు), 200 మీటర్ల రేస్, జావెలిన్ త్రో, 200 మీటర్ల పరుగు, పోల్ వాల్ట్, హై జంప్, షార్ట్పుట్ (4,000 కేజీ), 400 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు, 1500 మీటర్ల పరుగు, 5000 మీటర్ల పరుగు, హామ్మర్ త్రో, 400 మీటర్ల హర్డిల్స్ జరగనున్నాయి.