News January 31, 2025
ఎలమంచిలి: చెక్ బౌన్స్ కేసులో డీటీకి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో ఎలమంచిలి డిప్యూటీ తహశీల్దార్ టీ.హనుమాన్ వినయ్ కుమార్కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.9.05 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. 2019 నవంబర్ 14న టి.పద్మావతి దగ్గర డీటీ రూ.12 లక్షలు అప్పుగా తీసుకుని 2022న మార్చి 2న అప్పు తీర్మానం నిమిత్తం చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Similar News
News February 16, 2025
ఓటములే గుణపాఠాలు: విక్రాంత్

విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జ్ఞానం కోసం చదివినట్లయితే ఒత్తిడి అనేది ఉండదని యాక్టర్ విక్రాంత్ మాస్సే అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ లో నటి భూమి పెడ్నేకర్తో కలిసి పరీక్షల అనుభవాల్ని స్టూడెంట్స్తో పంచుకున్నారు. ఓటములనేవి జీవితంలో భాగమని వాటినుంచే మనం అధికంగా నేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమకంటూ స్వంత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించేలా కృషి చేయాలన్నారు.
News February 16, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మనదే హవా

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు టీమ్ ఇండియాపైనే ఉంది. మన జట్టు ఇప్పటివరకు 18 విజయాలు తన ఖాతాలో జమ చేసుకుంది. ట్రోఫీ చరిత్రలోనే భారత్ నిలకడైన జట్టుగా కొనసాగుతోంది. ఆ తర్వాత శ్రీలంక (14), ఇంగ్లండ్ (14), వెస్టిండీస్ (13), ఆస్ట్రేలియా (12), న్యూజిలాండ్ (12), సౌతాఫ్రికా (12), పాకిస్థాన్ (12) ఉన్నాయి.
News February 16, 2025
బోనకల్: గుండెపోటుతో నిద్రలోనే యువకుడు కన్నుమూత

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బోనకల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కలకోటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తోకచిచ్చు నిహార్ రాత్రి అన్నం తిని పడుకున్నాడు. ఉదయం లేచేసరికి వాంతి చేసుకున్నట్లు ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిహార్ హార్ట్ ఎటాక్తో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటికి పెద్ద కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.