News December 17, 2024
ఎలమంచిలి పట్టణంలో బంగారం చోరీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734404812760_19090094-normal-WIFI.webp)
ఎలమంచిలి పట్టణ రామ్మూర్తి నగర్లో గల రిటైర్డ్ ఎక్సైజ్ ఉద్యోగి బీవీ రమణ ఇంటిలో దొంగలు పడి రూ.4 లక్షలు, 4 తులాల బంగారం దోచుకుపోయారు. ఇంటికి తాళాలు వేసి రమణ కుటుంబ సభ్యులు బళ్లారి వెళ్లారు. సోమవారం పనిమనిషి వచ్చి చూడగా తాళం తీసి ఉంది. రమణ ఇంటికి వెళ్లమనడంతో బంధువులు వెళ్లి పరిశీలించగా నగదు, బంగారం పోయినట్లు గుర్తించారు. ఈ మేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 24, 2025
గంభీరం డ్యామ్లో బీటెక్ విద్యార్థి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737722104590_52419162-normal-WIFI.webp)
ఆనందపురం మండలం గంభీరం డ్యామ్లో ఈతకు వెళ్లి విద్యార్థి మీసాల నాని(20) మృతి చెందాడు. సివిల్ ఇంజినీర్ థర్డ్ ఇయర్ చదువుతున్న నాని కోమ్మదిలో ఓ ప్రవేటు హాస్టల్లో ఉంటున్నాడు. మృతుడు విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటకు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 24, 2025
పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం: విశాఖ కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737719536707_20522720-normal-WIFI.webp)
జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలా సహకారం అందించాలని సూచించారు. భూ సేకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
News January 24, 2025
ఆదివారం మాంసం దుకాణాలు బంద్: జీవీఎంసీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737705090589_51703515-normal-WIFI.webp)
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు మేరకు విశాఖలో మాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ దువ్వాడ, మంగళపాలెం, నరవ ప్రాంతాల్లో దుకాణ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.