News March 18, 2025
ఎలమంచిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఎలమంచిలి సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని (50) వ్యక్తి మృతి చెందాడు. తుని రైల్వే SI ఎన్ రవికుమార్ వివరాల ప్రకారం.. రేగుపాలెం-ఎలమంచిలి రైల్వే స్టేషన్ మధ్యలో సోమవారం రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడన్నారు. మృతుని ఐడెంటిటీకి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని, వివరాలు తెలిసిన వారు తుని జీఆర్పీ స్టేషన్ను సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామన్నారు.
Similar News
News December 9, 2025
విశాఖలో 16 అనధికార, నిర్మాణ భవనాల తొలగింపు

జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలో విశాఖలో ఆగస్టు 31 తర్వాత నిర్మించిన అనధికార భవనలను తొలగిస్తున్నట్ల జీవీఎంసీ ఛీప్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. జోన్-2లో 3, జోన్-3లో 2, జోన్-4లో 3, జోన్-5లో 4, జోన్-6లో 3, జోన్-8లో ఒక నిర్మాణంతో కలిపి మొత్తం 16 అనధికార నిర్మాణాలను రెండు రోజుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన బీపీఎస్ను వినియోగించుకోవాలన్నారు.
News December 9, 2025
TTD: మెరుగైన సేవలకు అభిప్రాయ సేకరణ

AP: మరింత మెరుగైన సేవల కోసం భక్తుల నుంచి TTD అభిప్రాయాలు సేకరిస్తోంది. IVRS ద్వారా వసతి, అన్నప్రసాదం సహా 17అంశాలపై సమాచారం తీసుకుంటోంది. తిరుమల, తిరుపతిలో పెట్టిన QR కోడ్లను స్కాన్ చేస్తే వచ్చే వాట్సాప్ నంబర్ 93993 99399లోనూ టెక్స్ట్/వీడియో ద్వారా భక్తుల నుంచి సమాచారం తెలుసుకుంటోంది. ప్రతినెల తొలి శుక్రవారం 0877-2263261 నుంచి డయల్ యువర్ EO ద్వారా సమస్యలు వింటూ సేవా నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తోంది.
News December 9, 2025
ASF యూత్ కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జ్లు

తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ సంస్థను బలపరచేందుకు జిల్లా వారీగా అధిష్ఠానం కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది. ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా రవికాంత్ గౌడ్, సెక్రటరీగా అమ్ముల మధుకర్ యాదవ్ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ ప్రకటించింది. యువత చేరిక, బూత్ స్థాయిలో బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది.


