News February 21, 2025

ఎలమంచిలి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

ఎలమంచిలి మండలం పెద్దపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం చెందాడు. హైవే జంక్షన్‌లో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు స్థానిక గాంధీ నగరానికి చెందిన సత్యనారాయణ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 8, 2025

4వ రోజు అమరావతిలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ బృందం

image

అమరావతి రాజధాని ప్రాంతంలో గత మూడు రోజులుగా EB&ADB బృందం పర్యటిస్తున్నారు. 4వ రోజు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ట్రాఫిక్ స్లో నిర్వహణ, రహదారులు BRT ప్రణాళిక తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అమలు కావాల్సిన కార్యకలాపాలపై చర్చలు జరిపారు. అనంతరం APCRDA అధికారులు, విజిలెన్స్ ఫెసిలిటేటర్స్, NGO సంస్థలతో బృందం సమావేశమైంది. రైతులు, రైతు కూలీలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు.

News December 8, 2025

రిటర్నింగ్ అధికారులతో జనగామ అదనపు కలెక్టర్ సమీక్ష

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించబోయే రిటర్న్ అధికారులతో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలను పారదర్శకంగా చేపట్టాలని, సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఫేజ్–1 మండలాల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు డ్యూటీ ఆర్డర్, ఓటర్ ఐడీతో 9 డిసెంబర్ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలన్నారు.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్ PHOTO GALLERY

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు ముగిసింది. ఇవాళ రూ.1.88లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. CM రేవంత్ అన్నీ తానై పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన చూడవచ్చు.