News February 21, 2025

ఎలమంచిలి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

ఎలమంచిలి మండలం పెద్దపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం చెందాడు. హైవే జంక్షన్‌లో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు స్థానిక గాంధీ నగరానికి చెందిన సత్యనారాయణ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 24, 2025

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

image

బ్యాంకు ఖాతాల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <>పోర్టల్‌లో<<>> లాగిన్ అయి తెలుసుకోవచ్చు. ఖాతాదారుడు లేదా వారి కుటుంబ సభ్యుల పేరు, PAN, DOB వంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే వారి వారసులు డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్, KYC డాక్యుమెంట్లతో బ్యాంకును సంప్రదించాలి. DEC 31లోగా క్లెయిమ్ చేసుకోని నగదును డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్(DEAF) ఖాతాకు బదిలీ చేస్తారు.

News November 24, 2025

ఖమ్మం: విశ్వామిత్ర చౌహాన్‌కు వరల్డ్ రికార్డు

image

ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ ‘విశ్వ గురు వరల్డ్ రికార్డు’ను అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో హీరోయిన్ కుమారి శ్రీలు, ఇంటెలిజెన్స్ ఏసీపీ రాజీవ్ రెడ్డి, నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా చౌహాన్ ఈ ప్రతిష్ఠాత్మక రికార్డును స్వీకరించారు. అతిథులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు

News November 24, 2025

నెలకు రూ.25 వేలతో ఉద్యోగాలు

image

ధర్మవరంలోని పాలిటెక్నిక్ కళాశాల ఈనెల 26న ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. నెలకు రూ.15,000 నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని పేర్కొన్నారు.