News February 20, 2025

ఎలమంచిలి: రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

అనకాపల్లి జిల్లాలో నిన్న జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. ఎలమంచిలికి చెందిన డి.సన్యాసిరావు బైకుపై వస్తుండగా.. లైనుకొత్తూరు వద్ద లారీ ఢీకొట్టడంతో మృతిచెందారు. అలాగే రేగుపాలెం వద్ద మరో ప్రమాదం జరిగింది. రాజాన మోహన్(24) బైకుపై వస్తూ రోడ్డు పక్కన వృద్ధుడిని ఢీకొట్టాడు. ఆ తర్వాత స్పీడ్ కంట్రోల్ చేయలేక ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. 

Similar News

News November 11, 2025

గవర్నర్ కర్నూలు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ కర్నూలు పర్యటన ఖరారయింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12న కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం నగరంలోని మాంటిస్సోరి విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆయన రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో కలిసి పాల్గొననున్నారు.

News November 11, 2025

HYD: నిర్మాణంలో ఉన్న అందెశ్రీ ఇల్లు ఇదే..!

image

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ NFC నగర్‌లో కవి అందెశ్రీ నిర్మించుకుంటున్న ఇల్లు ఇంకా పూర్తి కాలేదు. 348 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న G+3 భవనం నిర్మాణ దశలో ఉంది. ఇల్లు నిర్మించే స్థోమత లేక లాలాపేటలోని ఇరుకు ఇంట్లో ఉంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌ ఆర్థిక సహాయం చేయడంతో గృహ నిర్మాణం ప్రారంభమైంది. పనులను స్వయంగా పర్యవేక్షించేవారు. కలల సౌధం పూర్తికాకముందే అందెశ్రీ కాలం చేశారు.

News November 11, 2025

చలికి వణుకుతున్న జగిత్యాల జిల్లా

image

జగిత్యాల జిల్లా చలికి వణుకుతోంది. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన్నెగూడెంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.5℃గా నమోదైంది. అటు గోవిందారం 12.7, మల్లాపూర్, రాఘవపేట, గొల్లపల్లె, తిరమలాపూర్ 12.9, కాత్లాపూర్, నేరెల్ల 13, పూడూర్ 13.3, రాయికల్ 13.4, కోల్వాయి, సరంగాపూర్, మెడిపల్లి 13.7, కోరుట్ల 13.8, పెగడపల్లె 13.2, మల్యాల 13.9, జగిత్యాలలో 14.1℃ గా నమోదయ్యాయి. మిగతా ప్రాంతంల్లోనూ చలి తీవ్రత ఉంది.