News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపిస్తున్న మృతుడి బంధువులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 15, 2025
‘తెలంగాణ విజన్’… మీ ఆలోచన ఏంటి?

తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓ డాక్యుమెంట్ను రూపొందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని టాప్లో నిలబెట్టేలా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. వ్యవసాయం, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, స్థానిక సంస్థల బలోపేతం సహా పలు అంశాలపై ప్రతి పౌరుడు తప్పనిసరిగా OCT 25 లోగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మీ ఆలోచన పంచుకోవడానికి <
News October 15, 2025
అసలు రవికుమార్ ఎక్కడ..?

తిరుమల శ్రీవారి ఆలయంలో విదేశీ కరెన్సీ చోరీ చేసిన రవికుమార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు. ఈ కేసు గత ప్రభుత్వ హయాంలో లోక్ అదాలత్లో రాజీ అయిందని అనుకునేలోపు తిరిగి సీఐడీ చేతికి వెళ్లింది. ప్రస్తుతం హై కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ త్వరలో విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో చోరీ చేసిన రవికుమార్ ఎక్కడ ఉన్నారో తెలియాల్సి ఉంది.
News October 15, 2025
సిద్దిపేట: ఆశావహుల్లో ఆందోళన..!

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆశావహుల్లో ఆందోళన పెరిగింది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా గెలవాలని ఉత్సాహంగా ముందస్తు కార్యక్రమాలు చేపట్టిన వారికి నిరాశ ఎదురైంది. ఎన్నికలు వాయిదా పడడంతో, ఖర్చులు పెట్టి మళ్లీ పోటీ చేసినా తర్వాత ఎన్నికలు నిలిచిపోతే పరిస్థితి ఏంటంటూ కొందరు వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి తగ్గిపోయింది.