News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపిస్తున్న మృతుడి బంధువులు.
Similar News
News October 20, 2025
SRCL: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు..!

వరుస లొంగుబాట్లపై నిషేధిత CPI, మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్, ఆశన్న విప్లవ ద్రోహులుగా మిగిలిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కేంద్ర కమిటీ తాజాగా లేఖను విడుదల చేసింది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారు లొంగిపోయారని బహిరంగంగా ఆరోపించింది.
News October 20, 2025
WWC: భారత్ సెమీస్ చేరాలంటే?

WWCలో ఇంగ్లండ్పై ఓటమితో టీమ్ఇండియా సెమీస్ <<18053841>>ఆశలు<<>> సంక్లిష్టంగా మారాయి. రాబోయే రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్పై గెలిస్తేనే ఇతర జట్ల ప్రదర్శనతో సంబంధం లేకుండా సెమీస్ చేరనుంది. ఒకవేళ న్యూజిలాండ్తో మ్యాచులో టీమ్ఇండియా ఓడితే బంగ్లాపై తప్పక గెలవాలి. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో NZ ఓడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన RR ఉంటేనే భారత్ సెమీస్ చేరనుంది.
News October 20, 2025
కోరుట్ల నుంచి మహోర్కు SPL. TOUR

కోరుట్ల డిపో నుంచి ఈనెల 26న మహోర్కు వన్డే ప్రత్యేక టూర్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఉదయం 4గం.లకు మహోర్(MH)కు బస్సు బయలుదేరి అదేరోజు రాత్రి తిరిగి కోరుట్లకు చేరుకుంటుందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ అందిస్తామని, ఒక్కరికి రూ.1,250లను ఛార్జిగా నిర్ణయించామన్నారు. రేణుక మాత(ఎల్లమ్మ, పరశురాము), దత్తాత్రేయ పీఠం, ఏకవీర శక్తిపీఠం, ఉంకేశ్వర్ శివాలయాల దర్శనాలు ఉంటాయి.