News March 7, 2025
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో వాటికి పేమెంట్ జరిగి ప్రక్రియ పూర్తయ్యే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ GWMC కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా పంచాయతీ, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ శాఖల్లో ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 2, 2026
ములుగుపై మాజీ కన్ను!

లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించి, లొంగిన వారితో ఏకంగా CM రేవంత్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో రాజకీయాల్లో ఆరంగ్రేటం చేయాలని సూచనలు చేశారట. దీంతో ములుగు జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే మాజీలు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
News March 2, 2026
B2 బాంబర్ గర్జన: 37 గంటల జర్నీ.. 900 స్ట్రైక్స్!

USకు చెందిన B2 Spirit Stealth Bombers ఇరాన్లోని అండర్గ్రౌండ్ బాలిస్టిక్ మిస్సైల్ కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. బ్రిటన్ మొదట తన బేస్లను వాడుకోనివ్వకపోవడంతో USలోని మిస్సోరి నుంచి బయలుదేరి ఏకధాటిగా 37 గంటల పాటు ప్రయాణించి దాదాపు 900 దాడులు చేసినట్లు సమాచారం. గాలిలోనే ఇంధనం నింపుకొంటూ వెళ్లిన ఈ స్టెల్త్ విమానాలు GBU-31 గైడెడ్ బాంబులతో ఇరాన్ రక్షణ వ్యవస్థకు అందకుండా మిస్సైల్ కేంద్రాలను ధ్వంసం చేశాయి.
News March 2, 2026
నిర్మల్: వరి సాగు చేస్తున్నారా..? ఈ పద్ధతి పాటించండి

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 1.21 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పంట అధిక దిగుబడి రావాలంటే సస్యరక్షణ చర్యలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజి కుమార్ రైతులకు సూచిస్తున్నారు. చీడపీడల నుంచి రక్షణ పొందాలంటే పంటలో కాలిబాటలు చేసుకోవాలని తెలుపుతున్నారు. దీనివల్ల గాలి, సూర్యరష్మితో పాటు పంటకు ఎరువులు, మందులు పిచికారీ చేయడానికి వీలుగా ఉంటుందని చెబుతున్నారు.


