News March 1, 2025
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పై 25% రాయితీ: జిల్లా కలెక్టర్

శుక్రవారం సీఎస్తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 31వ తేదీతో లే అవుట్ల దరఖాస్తుల రుసుము చెల్లించే గడువు ముగుస్తుందన్నారు.
Similar News
News March 1, 2025
ప్రియుడితో దాడి చేయించిన భార్య.. మృత్యువుతో పోరాడి భర్త మృతి

TG: వరంగల్లో 8 రోజులుగా మృత్యువుతో పోరాడి వైద్యుడు సుమంత్ రెడ్డి నేడు చనిపోయారు. FEB 20న ఇతనిపై భార్య మరియా ప్రియుడితో దాడి చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిమ్లో శామ్యూల్తో మరియాకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో సుమంత్ కాపురాన్ని WGLకు మార్చారు. భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేయగా వీరికి కానిస్టేబుల్ రాజ్ హెల్ప్ చేశాడు. ప్రస్తుతం ముగ్గురూ అరెస్ట్ అయ్యారు.
News March 1, 2025
వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్పై వెళ్తున్న శివ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై జి. కళాధర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
News March 1, 2025
లక్కర్ దొడ్డి: గుండెపోటుతో వ్యక్తి మృతి..!

నర్వ మండల కేంద్రంలో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల వివరాలిలా.. లక్కర్ దొడ్డి గ్రామానికి చెందిన అవుసలి బాలకృష్ణయ్య(80) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు తెల్లవారుజామున ఛాతిలో నొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలో మృతిచెందారు.