News March 1, 2025
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పై 25% రాయితీ: జిల్లా కలెక్టర్

శుక్రవారం సీఎస్తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 31వ తేదీతో లే అవుట్ల దరఖాస్తుల రుసుము చెల్లించే గడువు ముగుస్తుందన్నారు.
Similar News
News March 21, 2025
KMR: పిడుగు పాటుతో గేదెలు, గొర్రెలు మృతి

అల్పపీడన ద్రోణి ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో శుక్రవారం అకాల వర్షం కురిసింది. బిక్కనూరు, రాజంపేట, సదాశివనగర్, లింగంపేట తదితర మండలాల్లో అకాల వర్షం పడింది. లింగంపేట మండలం లింగంపల్లి శివారులో పిడుగు పడింది. పిడుగు పాటుకు 2 బర్రెలు మృతి చెందాయి. లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామ శివారులో పిడుగు పడి మూడు గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.
News March 21, 2025
ఆకివీడు: స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

ఆకివీడు మండలం చిన కాపవరంలోని వయ్యేరు కాలువలో శుక్రవారం స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 5వ తరగతి చదువుతున్న పడికౌరు శరత్కుమార్ (10) కటారి పవన్ సాయి (10)లు మధ్యాహ్నం సమయంలో ఈతకొట్టేందుకు కాలువలోకి దిగారు. ఇద్దరు ఒక్కసారిగా కాలువలో మునిగిపోయారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News March 21, 2025
అలా జరిగితే ‘మ్యాడ్ స్క్వేర్’ రికార్డు!

నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ ఈనెల 28న విడుదల కానుంది. వారం రోజుల్లో విడుదలవనుండగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేయకూడదని మేకర్స్ భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇలా జరిగితే ట్రైలర్ లేకుండా రిలీజైన తొలి సినిమాగా రికార్డులకెక్కనుంది. కాగా, ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీగా అంచనాలున్నాయి.