News March 11, 2025

ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతంగా చేయాలి: KMR కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి మునిసిపాలిటీలో LRS హెల్ప్ లైన్ డెస్కులను ఆయన పరిశీలించారు. ప్రతీ దరఖాస్తుదారుడికి సమాచారం అందించి, రిబేట్ గురించి తెలియజేయాలన్నారు. ప్రతిరోజూ LRSపై సమీక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.

Similar News

News October 24, 2025

సిద్దిపేట: ప్లేస్కూల్ సామగ్రి టెండర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

సిద్దిపేట కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో కొత్తగా 51 ప్లే-స్కూల్‌లలో కావాల్సిన సామగ్రి టెండర్ ప్రక్రియను కలెక్టర్ కె.హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 51 ప్లే-స్కూల్‌లలో కావాల్సిన సామగ్రి ఆట వస్తువులు, ఛైర్స్, టేబుల్స్ ఇతరత్ర వస్తువులను 8 కంపెనీ ప్రతినిధులు వారు తయారు చేసిన వస్తువులు ప్రదర్శించారు.

News October 24, 2025

పెద్దపల్లి: పత్తి క్వింటా ధర రూ.7,011

image

పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం పత్తి క్వింటా ధర గరిష్ఠంగా రూ.7,011, కనిష్ఠంగా రూ.5,210గా నమోదైంది. మోడల్ ధర రూ.6,750గా నిర్ణయించారు. మొత్తం 349 మంది రైతులు 986 గోనె సంచుల్లో 1,010.90 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌ యార్డులో ఎటువంటి సమస్యలు లేకుండా కొనుగోళ్లు సజావుగా సాగాయని పేర్కొన్నారు.

News October 24, 2025

జగదేవ్‌పూర్: కొండపోచమ్మ అమ్మవారి ఆదాయం రూ.88.90 లక్షలు

image

శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవాదాయశాఖ అధికారులు, ఈవో రవి కుమార్, కొండపోచమ్మ గుడి కమిటీ ఛైర్‌పర్సన్ అను గీత, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో పూజా సామగ్రి రూ.23.10 లక్షలు, కొబ్బరికాయలు, అమ్మవారి ఒడిబియ్యం రూ.25.70 లక్షలు, లడ్డూ, పులిహోర రూ.30.20 లక్షలు, పువ్వులకు రూ.2 లక్షలు, కొబ్బరి ముక్కల సేకరణ రూ.7.90 లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు.