News March 11, 2025
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతంగా చేయాలి: KMR కలెక్టర్

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి మునిసిపాలిటీలో LRS హెల్ప్ లైన్ డెస్కులను ఆయన పరిశీలించారు. ప్రతీ దరఖాస్తుదారుడికి సమాచారం అందించి, రిబేట్ గురించి తెలియజేయాలన్నారు. ప్రతిరోజూ LRSపై సమీక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.
Similar News
News March 17, 2025
నేటి నుంచి ‘యువ వికాసం’ దరఖాస్తులు షురూ

TG: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 5వరకూ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.లక్ష నుంచి 3లక్షల వరకూ రుణాలు అందించనున్నారు. ఇందులో 60-80% వరకు రాయితీ ఉంటుంది. రూ.6 వేల కోట్లతో 5లక్షల మంది యువతకు రుణాలిచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దరఖాస్తుకు సైట్: tgobmms.cgg.gov.in
News March 17, 2025
బీబీనగర్: అర్ధరాత్రి చోరీ.. బైక్పై దొంగలు!

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమారంలో ఆదివారం అర్ధరాత్రి తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో బైక్పై ఇద్దరు వ్యక్తులు తిరుగుతుండగా సీసీ కెమెరాలలో రికార్డైంది. బీబీనగర్ పెట్రోలింగ్ పోలీసులు దొంగలు చొరబడిన ఇళ్లను పరిశీలించారు. బాధితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News March 17, 2025
టెన్త్ విద్యార్థులకు ఫ్రీ బస్

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విశాఖ జిల్లాలోని విద్యార్థులందరినీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 7 డిపోల నుంచి 150 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి ముందు, ముగిసిన తర్వాత 2.30 గంటల వరకు బస్సులు షెడ్యూల్, స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హాల్ టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.