News January 26, 2025
ఎల్కతుర్తి PS వద్ద యాక్సిడెంట్.. మహిళ మృతి

ఎల్కతుర్తి మండల పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందారు. మృతురాలు జంగం బుజ్జమ్మ(55)గా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద బంధువులు రోదిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 1, 2026
వరంగల్: పెరుగుతున్న విద్యుత్ వినియోగం

వేసవి ప్రారంభంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిశ్రమలతో పాటు గృహావసరాల వినియోగదారులు ఏసీలు, మిషన్లు, ఇతర వాడకానికి విద్యుత్ అధికంగా వినియోగిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో మొత్తం 73,21,442 సర్వీసులు ఉండగా, శనివారం 6,057 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ వినియోగం రికార్డయింది. కాగా, గత సంవత్సరం మార్చి 11న 5,816 గరిష్ఠంగా విద్యుత్ వినియోగం ఐనట్లు అధికారులు వెల్లడించారు.
News March 1, 2026
ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా!

ఇవాళ HYDలో బంగారం, వెండి ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,68,710, 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,650గా ఉంది. కేజీ వెండి ధర రూ.3,20,000 పలుకుతోంది. మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రేపు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News March 1, 2026
గ్రేటర్ వరంగల్లో చికెన్ వ్యర్థాల సిండికేట్ దందా!

వరంగల్ ట్రై సిటీలో చికెన్ షాపుల వ్యర్థాల సేకరణలో సిండికేట్ దందా కొనసాగుతోంది. హనుమకొండకు చెందిన ఓ లీడర్ ఈ సిండికేట్ దందాకు బాస్గా ఉన్నట్టు తెలుస్తోంది. 3వేల షాపుల దగ్గరి నుంచి రోజు దాదాపు లక్షన్నర కేజీల వ్యర్థాలను సేకరించి, వాటిని చేపల దాణా కోసం ఆంధ్రాకు తరలిస్తున్నారు. తక్కువ ధరకే టెండర్లను దక్కించుకొని, ఎక్కువ మొత్తంలో చేతులు మారుస్తూ గ్రేటర్ ఆదాయంకు గండి పెడుతున్నారనే విమర్శలున్నాయి.


