News February 15, 2025

ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

image

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.

Similar News

News November 11, 2025

సంగారెడ్డి: మండల వనరుల కేంద్రాలకు నిధులు విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోనీ మండల వనరుల కేంద్రాలకు (ఎంఆర్‌సీ), క్లస్టర్‌ రిసోర్స్‌ సెంటర్‌(సీఆర్సీ)ల నిర్వహణకు నిధులు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 50 శాతం నిధులను విద్యాశాఖ మంజూరు చేసిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 29 ఎంఆర్‌సీలకు రూ.13,05,000, 85 సీఆర్సీలకు రూ.14,02,500 చొప్పున విడుదల అయ్యాయని పేర్కొన్నారు.

News November 11, 2025

కేంద్ర వైఫల్యం వల్లనే ఢిల్లీలో పేలుడు: కాంగ్రెస్ నేత

image

ఢిల్లీలో పేలుడు ఘటన పూర్తిగా కేంద్రం వైఫల్యమేనని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. ఫరీదాబాద్‌లో 360 KGల పేలుడు పదార్థాలు దొరికినా ప్రభుత్వం నిరోధించలేకపోయిందన్నారు. ‘ఆరేళ్ల క్రితం పుల్వామాలో 350 KGల RDX దొరికింది. ఇటీవల ఢిల్లీ ATCపై సైబర్ ఎటాక్‌తో 800 ఫ్లైట్స్‌కు ఆటంకం కలిగింది. ఇలాంటివి జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు’ అని విమర్శించారు. దేశంలో భయంకర పరిస్థితులున్నాయన్నారు.

News November 11, 2025

CM పర్యటనకు పటిష్ఠ బందోబస్తు: DIG

image

రాయచోటి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. మంగళవారం హెలిపాడ్ ప్రాంగణం, ప్రజా వేదిక, కార్యకర్తల వేదికతో పాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎస్పీ ధీరజ్‌తో కలిసి ఆయన పరిశీలించారు.