News February 15, 2025
ఎల్బీనగర్లో పోలీసుల కష్టాలు! (PHOTO)

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.
Similar News
News November 11, 2025
నాయుడుపేట సెజ్లో రూ.3,038 కోట్ల పెట్టుబడి.. 2,265 మందికి జాబ్స్

మంత్రివర్గ సమావేశంలో CM చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట సెజ్లో పలు కంపెనీలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఏపీటోమ్ కాంపోనెంట్స్ రూ.700 కోట్ల పెట్టుబడితో PCBలు, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. వాల్ట్సన్ LABS రూ.1,743 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ రూ.595 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనుంది.
News November 11, 2025
ధనియాల సాగు – అనువైన రకాలు

మనదేశంలో రబీ పంటగా అక్టోబర్-నవంబర్ నెలల్లో ధనియాలు నాటుతారు. ఈ పంట ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. APలో రాయలసీమ జిల్లాల్లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.
☛ ధనియాల సాగుకు అనువైన రకాలు – సి.ఒ.1, సి.ఒ.2, సి.ఒ.3, సి.ఒ.(సి.ఆర్)4, సి.ఎస్.287, కరన్, సి.ఐ.ఎం.ఎస్-33, సి.ఎస్.2, జి.ఎ.యు-1, యు.డి-1, యు.డి-2, యు.డి-20, యు.డి-21. వీటిలో అనువైన రకాలను వ్యవసాయ నిపుణుల సూచనలతో నాటుకోవాలి.
News November 11, 2025
మేడ్చల్ జిల్లాలో అత్యధిక చలి..అక్కడే!

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత గత మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతుంది. ఘట్కేసర్ పరిధి కొండాపూర్లో అత్యల్పంగా 12.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొండాపూర్, ఘట్కేసర్, దేవరయంజాల, మల్కారం, ఉప్పల్, దూలపల్లి ఫారెస్ట్ ఏరియా, అలియాబాద్ ప్రాంతాల్లో అత్యధిక చలి ఉన్నట్లుగా TSRPS గ్రానులర్ రిపోర్ట్ గుర్తించింది.


