News February 15, 2025
ఎల్బీనగర్లో పోలీసుల కష్టాలు! (PHOTO)

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.
Similar News
News October 3, 2025
NLG: ఎస్టీ ఓట్లే లేవు.. రిజర్వేషన్ మాత్రం వారికే..!

అనుముల (M) పేరూరు పంచాయతీలో ఎస్టీ జనాభాయే లేదు. కానీ ప్రభుత్వం ఆ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇక్కడ మొత్తం 792 మంది ఓటర్లున్నారు. అందులో 421 మంది మహిళలు, 371 మంది పురుషులు. వీరిలో 665 మంది బీసీ ఓటర్లు కాగా, 107 మంది ఎస్సీలు, 20 మంది ఓసీ ఓటర్లు ఉన్నారు. అధికారులు ఎన్నికల జాబితాలో ఎక్కడా ఎస్టీ ఓట్లను చూపించలేదు. కానీ పంచాయతీని మాత్రం ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు.
News October 3, 2025
TTD ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్లో మార్పులు..!

తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో శుక్రవారం జరిగింది. ప్రస్తుతం 3నెలల ముందు ఆన్లైన్లో దర్శన టికెట్ల విడుదల చేస్తుండగా ఈ విధానాన్ని మార్చాలని పలువురు భక్తులు కోరారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. 3నెలల అడ్వాన్స్ టికెట్ బుకింగ్లో మార్పులకు ప్రయత్నిస్తామన్నారు. నెల రోజుల ముందే టికెట్లు విడుదల చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి TTD బోర్డు నిర్ణయయం ఎలా ఉంటుందో?
News October 3, 2025
MDK: ఎన్నికలు.. ఖర్చు పెట్టే వారికే టికెట్లు?

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 9న విడుదల చేయనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఖర్చు పెట్టుకుంటామని ముందుకు వచ్చే వారికే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీనిపై మీ కామెంట్.