News February 15, 2025

ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

image

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.

Similar News

News November 15, 2025

జూబ్లీహిల్స్: స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 29 మంది స్వతంత్రులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో 10 మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారంతా రెండంకెల ఓట్లకే పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608. బరిలో నిలిచిన వారిలో 41 మంది అభ్యర్థులకు రెండంకెల ఓట్లు, ఒక స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు పోలయ్యాయి.

News November 15, 2025

సిరిసిల్ల: రాజీవ్ యువ వికాసం కోసం ఎదురుచూపులు

image

సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు మొత్తం 7,680 యూనిట్లు కేటాయించగా, 7,121 మంది అర్హులను ఎంపిక చేశారు. వీరికి స్వయం ఉపాధి కోసం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. ఆరు నెలలు గడుస్తున్నా రుణం అందకపోవడంతో యువతలో నిరాశ నెలకొంది.

News November 15, 2025

ములుగు: నెక్స్ట్ దామోదరేనా..!?

image

జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత తక్కల్లపల్లి వాసుదేవరావు @ ఆశన్న ఇటీవల లొంగిపోయారు. తాజాగా రాష్ట్ర నేత కొయ్యడ సాంబయ్య @ఆజాద్ పోలీసులకు పట్టుబడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ములుగులో మిగిలింది బడే చొక్కారావు @దామోదర్ ఒక్కరే. రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన చాలాకాలంగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.