News February 15, 2025

ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

image

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.

Similar News

News November 12, 2025

కరీంనగర్: ప్రభుత్వ బడుల్లో ఏఐ కోర్సు

image

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో AI బోధనకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. ఉమ్మడిKNR జిల్లాలో 2,498 స్కూల్స్‌ ఉండగా ప్రస్తుతం 84 ప్రాథమికోన్నత పాఠశాలల్లో కృత్రిమ మేధా బోధనను అందిస్తున్నారు. ఇందుకోసం కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయాలు అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

News November 12, 2025

సమయపాలన పాటించని సచివాలయాల సిబ్బందిపై చర్యలు: కలెక్టర్

image

పాడేరు: సమయపాలన పాటించని సచివాలయాల సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గత వారం హాజరు నమోదు చేయని, జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న సచివాలయాల సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

News November 12, 2025

విశాఖలో నేటి నుంచి డ్రోన్ ఎగురవేయుట నిషేదం

image

విశాఖలో భాగస్వామ్య సదస్సులు జరగనున్న నేపథ్యంలో నగరవాసులకు సీపీ శంఖబ్రత బాగ్చి మంగళవారం పలు సూచనలు చేశారు. ఈనెల 12వ తేదీ నుుంచి 16వ తేదీ వరకు ఏయూ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ ఎగురవేయట నిషేధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.