News March 26, 2025

ఎల్బీనగర్‌లో మర్డర్.. నిందితుల అరెస్ట్

image

LBనగర్ శివగంగకాలనీలో మార్చి 23న పాతకక్షలతో మహేశ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పురుషోత్తం, నాగార్జున, సందీప్, రాము, రాజరాకేశ్, కుంచల ఓంకార్‌ నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి ఫోన్‌లు, బైకు, కారు, గొడ్డలి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు CI వినోద్ కుమార్ తెలిపారు.

Similar News

News October 28, 2025

చిత్తూరు: విద్యుత్ ఉద్యోగులకు సెలవులు లేవు

image

మొంథా తుఫాన్ కారణంగా చిత్తూరు డివిజన్ లో విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈఈ మునిచంద్ర సిబ్బందిని అదేశించారు. మరో రెండు రోజుల పాటు సెలవులు ఎవరికీ ఇవ్వడం జరగదని, సెలవుల్లో ఉన్నవారు కూడా విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News October 28, 2025

హెయిర్ డై వాడే ముందు ఇవి తెలుసుకోండి

image

జుట్టుకు రంగువేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత, క్యాన్సర్ రావొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తప్పనిసరైతే తప్ప డై వాడకూడదంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే అమోనియా, PPD, హైడ్రోజన్ పెరాక్సైడ్ తలలోని నేచురల్ ఆయిల్స్​ని పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉంటే దురద, అలెర్జీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు.

News October 28, 2025

తుఫాను షెల్టర్లకు 534 మంది: మంత్రి నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో తుఫాను సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని 27 సహాయక కేంద్రాలకు 534 మంది ప్రజలను తరలించామని ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొంథా తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. 408 గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.