News March 26, 2025
ఎల్బీనగర్లో మర్డర్.. నిందితుల అరెస్ట్

LBనగర్ శివగంగకాలనీలో మార్చి 23న పాతకక్షలతో మహేశ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పురుషోత్తం, నాగార్జున, సందీప్, రాము, రాజరాకేశ్, కుంచల ఓంకార్ నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి ఫోన్లు, బైకు, కారు, గొడ్డలి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు CI వినోద్ కుమార్ తెలిపారు.
Similar News
News January 9, 2026
తిరుమల: 7 నిమిషాల్లో శ్రీవాణి టికెట్లు పూర్తి.!

తిరుమల శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ విధానం నేటి నుంచి ప్రారంభమైంది. 800 టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా 1+3 విధానంలో జారీ చేయగా 7ని.ల్లో పూర్తయ్యాయి. సా.4 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్లో 200 టికెట్లు ఆఫ్లైన్లో జారీ చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం(10రోజులు)లో 7.83 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. 2024లో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు.
News January 9, 2026
ఒక్కటవనున్న NCP? అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..!

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు NCP వర్గాలు మళ్లీ కలవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. పవార్ ఫ్యామిలీలో ఉన్న గొడవలు ఇప్పుడు సర్దుకున్నాయని అన్నారు. పింప్రి చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల కోసం రెండు వర్గాలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. NCP ఫౌండర్ శరద్ పవార్తో గ్యాప్ తగ్గినట్లు అజిత్ మాటలను బట్టి అర్థమవుతోంది.
News January 9, 2026
NGKL: పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. కొల్లాపూర్ మండలం సింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. బోధనా తీరు, విద్యార్థుల హాజరు, పరీక్షల సన్నద్ధతను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు.


