News February 2, 2025

ఎల్లారెడ్డిపేట: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య

image

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కోనేటి మల్లయ్య(43) అనే వ్యక్తి భార్య అంజవ్వతో గొడవపడ్డాడు. దీంతో భార్య, కూతురు శైలజ, కుమారుడు రాజులు తల్లిగారింటికి వెళ్లిపోయారు. తీవ్ర మనస్థాపానికి గురైన మల్లయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

Similar News

News December 31, 2025

విజయవాడ: స్వల్పంగా పెరిగిన చైన్ స్నాచింగ్ కేసులు

image

2025లో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆస్తి నేరాల్లో స్పష్టమైన తగ్గుదల నమోదైంది. డెకాయిట్ కేసులు 2 నుంచి 0కి, రోబరీ కేసులు 35 నుంచి 14కు, రాత్రి గృహభేధనలు 158 నుంచి 96కు, సాధారణ దొంగతనాలు 859 నుంచి 623కు తగ్గాయి. పగలు గృహభేధనలు 37 నుంచి 36కు స్వల్పంగా తగ్గాయి. అయితే లాభం కోసం హత్యలు 2 నుంచి 3కు, స్నాచింగ్ కేసులు 55 నుంచి 58కు కొద్దిగా పెరిగాయి.

News December 31, 2025

పెరుగుతున్న హత్యాయత్నం కేసులు.. ఫోకస్ పెంచండి సార్.!

image

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో పలు నేరాల్లో తగ్గుదల నమోదైంది. హత్యలు 39 నుంచి 34కి, కిడ్నాప్‌లు 54 నుంచి 46కి, తీవ్రమైన గాయాల కేసులు 87 నుంచి 71కి, సాధారణ గాయాల కేసులు 733 నుంచి 655కి తగ్గాయి. మహిళలపై నేరాల్లోనూ మెరుగుదల కనిపించగా, హత్యాయత్నం కేసులు మాత్రం స్వల్పంగా పెరిగినట్లు విజయవాడ పోలీస్ కమిషనరేట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

News December 31, 2025

నెల్లూరులో 6899 నాణ్యత లేని ఇళ్లు .!

image

ఇళ్లు లేని వారికి గూటిని సమకూర్చడంలోనూ.. అధికారులు.. కాంట్రాక్టర్ల ధన దాహం నిజమనేది తేటతెల్లమవుతోంది. స్వయానా గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ బాబు జిల్లా అధికారుల సమీక్షలో 6899 ఇళ్లు స్లాబులు, గోడలు, బేస్మెంట్లు నిర్మాణాలు నాణ్యత లోపించినట్లు తేల్చి చెప్పారు. వీటికి యుద్ధ ప్రాటిపాదికన మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందజేసిన పిదపే.. బిల్లులు మంజురు చేస్తున్నట్లు హెచ్చరించారు.