News January 31, 2025
ఎల్లారెడ్డిపేట: గ్యాస్ స్టవ్ అంటుకొని మహిళ మృతి

ఎల్లారెడ్డిపేటలోని ఓ మహిళకు ప్రమాదవశాత్తు గ్యాస్ స్టవ్ అంటుకోగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మ కంటి పద్మ(86)ఈనెల 18వ తేదీన తన ఇంట్లో గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తోంది. ఈక్రమంలో అగ్ని ప్రమాదానికి గురైంది. 45% శరీరం కాలిపోయింది. 13 రోజులు చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది.
Similar News
News November 22, 2025
మహిళలు గంధం రాసుకునేది ఎందుకంటే?

ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చుట్టాలతో, పెద్దవారితో ఆప్యాయంగా, వినయంగా మాట్లాడాల్సిన బాధ్యత ఇల్లాలుపై ఉంటుంది. అయితే కొందరు మహిళల మాటతీరు గట్టిగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు అతిథులు ఈ మాటతీరును ఇబ్బందిగా భావిస్తారు. అందుకే గొంతుపై గంధం రాస్తారు. ఇలా రాస్తే గొంతు సరళంగా, సున్నితంగా మారి మాటతీరు తియ్యగా, వినస్రవ్యంగా మారుతుందని నమ్మేవారు. స్త్రీ రూపానికి తగిన మృదువైన స్వరం ఉండాలని ఇలా చేశారు.
News November 22, 2025
కోర్టులో రహస్య చిత్రీకరణపై చర్యలు తీసుకోవాలి: YCP మాజీ MLA

AP: CBI కోర్టు జడ్జి ముందు YS జగన్ నిలబడి ఉండగా రహస్యంగా వీడియో చిత్రీకరించి కుట్రతో వైరల్ చేస్తున్నారని YCP మాజీ MLA సుధాకర్బాబు విమర్శించారు. దీనిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ ఎక్కడికెళ్లినా వేలాది మంది వస్తుండడంతో అక్కసుతో ఇలా వ్యక్తిత్వ హననానికి దిగజారారని మండిపడ్డారు. CBN జైల్లో ఉండగా ఫొటోల వంటివీ బయటకు రాకుండా నాటి జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని కాపాడిందన్నారు.
News November 22, 2025
రబీ రాగులు సాగు – అనువైన దీర్ఘకాలిక రకాలు

రబీలో ఆరుతడి పంటగా తేలిక రకం ఇసుక, బరువైన నేలల్లో డిసెంబర్ చివరి వరకు రాగులును సాగు చేయవచ్చు. రాగులులో గోదావరి, రత్నగిరి అన్ని ప్రాంతాల్లో సాగుకు అనువైన దీర్ఘకాలిక రకాలు. ☛ గోదావరి: పంటకాలం 120-125 రోజులు. అగ్గి తెగులును తట్టుకొని ఎకరాకు 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛రత్నగిరి: అధిక పోషక విలువలు గల రకం. పంటకాలం 115-125 రోజులు. అగ్గితెగులును తట్టుకొని ఎకరాకు 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.


