News January 24, 2025

ఎల్లారెడ్డిపేట: పెంచిన వారు వద్దు.. మొగుడే కావాలి

image

కనిపెంచిన తల్లిదండ్రులు వద్దని తాళి కట్టి పెళ్లి చేసుకున్న వాడే కావాలని అత్తగారింటికి వెళ్లిపోయిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కిష్ట నాయక్ తండాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా భవానిపేటకు చెందిన పుష్ప అనే యువతి భాను ప్రసాద్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నది. పోలీసుల కౌన్సెలింగ్లో తల్లిగారింటికి వెళ్ళింది. మూడు రోజుల తర్వాత తల్లిదండ్రులు వద్దని అత్తగారి ఇంటికి వెళ్ళింది.

Similar News

News February 9, 2025

ఉప్పల్‌లో డెలివరీ బాయ్ సూసైడ్!

image

ఉప్పల్ పీఎస్ పరిధి కురుమానగర్‌లోని ఓ ఇంట్లో వట్టిపల్లి శ్రావణ్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకొని మృతి చెందాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ తన స్నేహితులతో కలిసి కురుమానగర్‌లో ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని శ్రవణ్ కుమార్ సోదరుడు సందీప్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు బాడీని గాంధీ మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 9, 2025

ఉప్పల్‌లో డెలివరీ బాయ్ సూసైడ్!

image

ఉప్పల్ పీఎస్ పరిధి కురుమానగర్‌లోని ఓ ఇంట్లో వట్టిపల్లి శ్రావణ్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకొని మృతి చెందాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ తన స్నేహితులతో కలిసి కురుమానగర్‌లో ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని శ్రవణ్ కుమార్ సోదరుడు సందీప్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు బాడీని గాంధీ మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 9, 2025

ఏటూరునాగారం: రేపటి ఐటీడీఏ గిరిజన దర్బారు రద్దు

image

ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలో రేపు (సోమవారం) జరగనున్న గిరిజన దర్బారు రద్దు చేసినట్లు పీవో చిత్రమిశ్రా ఆదివారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున గిరిజన దర్బారు నిర్వహించడం లేదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు ఈ విషయాన్ని గమనించాలని పీవో కోరారు. దరఖాస్తులతో ఐటీడీఏకి రావద్దని సూచించారు.

error: Content is protected !!