News February 18, 2025

ఎల్లారెడ్డిపేట: బస్సు టైర్ పంచర్.. తప్పిన ప్రమాదం

image

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామ శివారులోని బస్సు టైర్ పంచర్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 110మంది ప్రయాణికులతో వెళుతుండగా బస్సు ఒక్క సైడు ఒరిగి ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి వన్ పల్లికి మరికొన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News October 15, 2025

కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

image

రేపు ప్రధాని <<18009233>>మోదీ<<>> కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.

News October 15, 2025

కేతిరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

image

తాడిపత్రికి వెళ్లినప్పటికీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో మిసిలేనియస్ అప్లికేషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఇప్పటికే మీకు రక్షణ కల్పించాం, ఇంకేం కావాలి?’ అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు. అనంతరం కేతిరెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.

News October 15, 2025

KMR: పేకాటపై ఉక్కుపాదం.. 18 మంది అరెస్ట్

image

కామారెడ్డి జిల్లాలో మంగళవారం పోలీసులు మూడు వేర్వేరు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 18 మందిని అరెస్ట్ చేశారు. పిట్లం మండలం చిల్లర్గిలో 9 మందిని అరెస్ట్ చేసి రూ.4,030 నగదు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నస్రుల్లాబాద్ మండలంలో ఐదుగురిని పట్టుకొని రూ.1,250 నగదు, 4 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకోగా లింగంపేట్ మండలంలో నలుగురిని అదుపులోకి తీసుకోని రూ.6,400 పట్టుకున్నారు.