News February 18, 2025

ఎల్లారెడ్డిపేట: బస్సు టైర్ పంచర్.. తప్పిన ప్రమాదం

image

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామ శివారులోని బస్సు టైర్ పంచర్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 110మంది ప్రయాణికులతో వెళుతుండగా బస్సు ఒక్క సైడు ఒరిగి ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి వన్ పల్లికి మరికొన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News November 28, 2025

సిద్దిపేట: గంగాపూ‌ర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 28, 2025

విజయవాడలో డయేరియా కేసులు.. వాస్తవమెంత.?

image

న్యూ RRపేటలో మరోసారి డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. వైద్యులు మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు మాత్రమే నమోదైందని, ఇది సాధారణమేనని అంటున్నారు. ఏళ్లనాటి పైపులైన్ల లీకుల కారణంగా కలుషిత నీరు వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి కాలుష్యం జరిగి డయేరియా కేసులు నమోదవుతున్న క్రమంలో అధికారులు వాటర్ బబుల్స్, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు తప్ప, సమస్యకు పరిష్కారం చూపడం లేదు.

News November 28, 2025

GWL: అనైతిక చర్యలకు ఆరేళ్లు నిషేధం: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనైతిక చర్యలకు పాల్పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని గద్వాల కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. పదవులను వేలం వేయడం, ఓటర్లను డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు భారత శిక్షాస్మృతి ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయరాదని సూచించారు.