News December 10, 2024
ఎల్లారెడ్డి: చిరుత దాడిలో దూడ మృతి?

ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత దాడిలో దూడమృతి చెందినట్లు బాధితుడు సత్యనారాయణ తెలిపారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ గెదేలతో పాటు దూడను వ్యవసాయ బావి వద్ద ఉంచి ఇంటికి వెళ్లాడు. తిరిగి బావి వద్దకు వద్దకు వచ్చి చూడగా దూడ మృతి చెందినట్లు గుర్తించారు. చిరుత దాడిలో గేదె మృతి చెందిందని సత్యనారాయణ ఆయన ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు పంచనామ నిర్వహించారు.
Similar News
News November 27, 2025
మీడియా సెంటర్ను ప్రారంభించిన NZB కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్లోని రూమ్ నం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (MCMC)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ అంకిత్, DPO శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
News November 27, 2025
NZB: మొదలైన నామినేషన్ల దాఖలు పర్వం

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ ల దాఖలు పర్వం మొదలైంది. తొలి దశ ఎన్నికలు జరిగేబోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు గురువారం ఉదయం నామినేషన్ లు దాఖలాలు చేయడం మొదలుపెట్టారు.
News November 27, 2025
NZB: మొదటి విడతలో ఓటేసే వారు ఎంతమంది అంటే?

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో 11 మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికల్లో 2,61,210 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. ఇందులో మహిళలు 1,37, 413 మంది, పురుషులు 1,23,790 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఇందు కోసం 1,653 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వివరించారు.


