News July 13, 2024

ఎవరైనా గంజాయి అమ్మితే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి: ఎస్పీ

image

అమాయక విద్యార్థులు, యువకులకు గంజాయి విక్రయించే వారికి జైలు శిక్ష తప్పదని ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ హెచ్చరించారు. ఒంగోలులో SP మాట్లాడుతూ.. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా 25 మందిని అరెస్టు చేసి వారి నుంచి 8.91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 14500కు తెలియజేయాలని కోరారు. SHAREit

Similar News

News December 11, 2025

ప్రకాశం ఎస్పీ చొరవ.. వృద్ధుడి ఇబ్బందులకు చెక్!

image

ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు చొరవతో కొండేపి మండలానికి చెందిన ఓ వృద్ధుడి సమస్య పరిష్కార దిశగా పయనించింది. కొండేపి మండలంకు చెందిన హరి నారాయణ (65) ఎస్పీ మీకోసం కార్యక్రమంలో సమస్యను విన్నవించుకున్నాడు. సమీప బంధువులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలపగా.. ఎస్పీ ఆదేశాలతో కొండేపి ఎస్సై ప్రేమ్ కుమార్ వృద్ధుడి ఇంటికెళ్లి మాట్లాడారు. వృద్ధుడికి ఇబ్బంది కలిగించవద్దని ఎస్సై వారికి సూచించారు.

News December 11, 2025

రాచర్ల: స్వగ్రామంలో మాజీ MLA అంత్యక్రియలు

image

మాజీ MLA పిడతల <<18527850>>రామ్ భూపాల్ రెడ్డి<<>> స్వగ్రామం రాచర్ల మండలం అనుమలవీడు గ్రామం. కాగా ఆయన ఇవాళ తెల్లవారుజామున స్వర్గస్తులైన విషయం తెలిసిందే. వారి పార్థివదేహాన్ని గురువారం అనుమలవీడుకు తరలిస్తామని, గ్రామంలోనే శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వారి తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

News December 11, 2025

గిద్దలూరు: రాజకీయంలో పిడతల కుటుంబం

image

గిద్దలూరు రాజకీయ ముఖ చిత్రంలో పిడతల కుటుంబం ప్రాధాన్యత అధికం. పిడతల రంగారెడ్డి 1937 నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్‌గా పదవులు చేపట్టారు. 1991లో ఈయన కన్నుమూశారు. 1994 ఎన్నికల్లో పిడతల రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ రెడ్డి గెలవగా.. 2001లో ఈయన మరణంతో ఉపఎన్నికలు జరిగాయి. ఈయన సతీమణి సాయికల్పన ఎమ్మెల్యే అయ్యారు.