News April 24, 2024

ఎవరైనా దాడి చేస్తే నాకు చెప్పండి: సీఎం జగన్

image

వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై ఎవరైనా దాడి చేస్తే తనకు చెప్పాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘అవతలి వారు మన మీద దాడి చేస్తే మనం విజయానికి చేరువలో ఉన్నామని.. అలాగే వారు విజయానికి దూరంలో ఉన్నట్లు భావించాలి’అని అన్నారు. ఈ సమావేశంలో భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

Similar News

News April 22, 2025

విశాఖలో పౌష్టికాహార ముగింపోత్సవాలు

image

విశాఖ ఉడా చిల్డ్రన్ ఏరినాలో పౌష్టికాహార ముగింపోత్సవాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నపిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

News April 22, 2025

గోపాలపట్నంలో ఈనెల 24న మెగా జాబ్ మేళా

image

గోపాలపట్నంలో ఈనెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మేళాలో 54 కంపెనీలు పాల్గొనున్నాయి. గోపాలపట్నం ఎస్.వి.ఎల్.ఎన్. జడ్పీ హై స్కూల్‌లో నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివిన వారు అర్హులు. ఆసక్తి గల వారు https://naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. >Share it

News April 22, 2025

విశాఖలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని 13 రైతు బజార్‌లలో కొనుగోలు చేసే కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లి రూ.18, వంకాయలు రూ. 15, బంగాళాదుంపలు రూ.18,కాకరకాయ రూ.30,బీరకాయలు రూ.32, బెండకాయలు రూ.22,క్యాబేజీ రూ.15,గోరు చిక్కుడు రూ.32,పొటల్స్ రూ.30,కాప్సికం రూ.40,టమాటా రూ.16, క్యారట్ రూ.26/28,దొండకాయలు రూ.18, బీన్స్ రూ.48,కీర దోస రూ.20, చేమ దుంపలు రూ.32, మిర్చి రూ.24గా ఉన్నాయి.

error: Content is protected !!