News February 19, 2025
ఎస్ఆర్ఎస్పీ కాల్వకు భూసేకరణ పూర్తి: మంత్రి పొంగులేటి

పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, కూసుమంచి మండలాలకు సంబంధించి SRSP 54 ప్యాకేజీ కాల్వలకు పూర్తి స్థాయిలో భూసేకరణ పూర్తి చేసినట్లు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భూసేకరణతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించటానికి మార్గం సులభం అవుతుందన్నారు. రైతులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 15, 2025
ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి: మంత్రి

విజయనగరం మహిళా ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సర్కులర్ ఆక్వా కల్చర్ విధానాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. మహిళల జీవనోపాధిని పెంచేందుకు ఇదో కొత్త అవకాశమన్నారు. వెలుగు 2.0 ద్వారా రాష్ట్రంలోని మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
News March 15, 2025
MBNR: GOOD NEWS.. APPLY చేసుకోండి.!

బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ & ఫైనాన్స్లో ఒక నెల నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన అర్హులైన బీసీ అభ్యర్థులు ఈనెల 15 నుంచి ఏప్రిల్ 8లోగా సంబంధిత వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏప్రిల్ 12న MBNRలో ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.
News March 15, 2025
మెదక్: యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య

యువకుడు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ పట్టణం బారా ఇమాంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్కు చెందిన అరవింద్ (26) ఫతేనగర్లో ఉంటూ ఆర్టీసీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.