News March 15, 2025
ఎస్ఎస్సీలో 100% ఫలితాలు సాధించాలి: ఖుష్బూ గుప్తా

వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.
Similar News
News March 16, 2025
ADB: పురుగుమందు తాగి ఒకరు.. ఉరేసుకొని ఇద్దరు సూసైడ్

ADB, NRML జిల్లాల్లో ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంద్రవెల్లి మండలం బుర్సాన్పటర్ గ్రామానికి చెందిన విద్యాసాగర్(57) మద్యం మత్తులో చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. బజార్హత్నూర్ మండలం రాంగనగర్కు చెందిన గంగారం(54) మద్యానికి బానిసయ్యారు. శనివారం తన పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కడెం మండలం మొర్రిగూడెంనకు చెందిన సత్తెన్న ఒంటరిజీవితం భరించలేక ఉరేసుకున్నాడు.
News March 16, 2025
ADB: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు DEO ప్రణీత ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News March 16, 2025
ఆదిలాబాద్-ఆర్మూర్ లైన్ ఎప్పుడో…?

ADBజిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుచేస్తామని CM రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. కానీ అంతకుముందు ADB-ARMR రైల్వేలైన్ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. ADB నుంచి NRML, ARMR, NZBకు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. అయితే రైల్వేలైన్ ఏర్పాటుచేయలేని ప్రభుత్వాలు AIRPORT తెస్తామంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.