News July 26, 2024
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

మెండోరా మండలం పోచంపాడ్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందిన సమాచారం మేరకు ప్రాజెక్టులోకి 25,150 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. క్రమక్రమంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1072.8 అడుగులకు నీటిమట్టం చేరుకోగా.. ప్రాజెక్టులో 28.389 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది.
Similar News
News October 14, 2025
నిజామాబాద్: బాలికలను ఆటపట్టించిన ఇద్దరి అరెస్టు

నిజామాబాద్లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోటగల్లి వద్ద సోమవారం బాలికలను ఫాలో చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఆకతాయిలను షీ టీం పట్టుకొని తదుపరి చర్యలకు టూటౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బాలికలను, మహిళలను ఎవరైనా వేధిస్తే షీ టీంకు తెలపాలన్నారు.
News October 13, 2025
NZB: బీజేపీ పోరాట ఫలితంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు: దినేష్ కులాచారి

బీజేపీ పోరాట ఫలితంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
News October 13, 2025
నిజామాబాద్లో సంఘటన్, సృజన్ అభియాన్

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మనలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సంఘటన్, సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా నాయకత్వం ఎంపిక ప్రక్రియ కోసం కాంగ్రెస్ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.