News September 26, 2024

ఎస్సారెస్పీ అప్డేట్.. 2 గేట్ల ద్వారా నీటి విడుదల

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నేడు ఉదయం 7 గేట్లు ఎత్తిన అధికారులు సాయంత్రం వరకు 5 గేట్లు మూసి 2 గేట్ల ద్వారా 33,318 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల(80.5TMC)కు గాను, ప్రస్తుతం 1091 అడుగుల (80.501TMC)ల నీరు నిల్వ ఉందన్నారు.

Similar News

News December 6, 2025

కరీంనగర్: ఈ నెల 22 వరకూ ఫీజు చెల్లించవచ్చు

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ప్రథమ, ద్వితీయ, ఎంబీఏ తృతీయ, ద్వితీయ విడత సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడువు ఈనెల 22 వరకు ఉన్నట్లు కరీంనగర్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఏం సత్య ప్రకాష్ తెలిపారు. ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

News December 6, 2025

EVMలకు కట్టుదిట్టమైన భద్రత.. వివిధ పార్టీలతో పరిశీలన

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శనివారం తనిఖీ చేశారు. ఆర్డీఓ మహేశ్వర్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ సహా పలు పార్టీల ప్రతినిధులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీస్ గార్డుల విధులను ఆమె పర్యవేక్షించారు.

News December 6, 2025

కరీంనగర్‌: అంబేడ్కర్‌కు బండి సంజయ్ నివాళి

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ.. దేశాభివృద్ధికి ఆయన అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.