News March 20, 2025
ఎస్సారెస్పీ స్టేజ్-2కు రూ.34.01 కోట్లు కేటాయింపు

సూర్యాపేట జిల్లాలోని SRSP స్టేజ్-2 కింద కొనసాగుతున్న పనులకు రూ.34.01 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. తూములు, షట్టర్లు, లైనింగ్ కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. జిల్లాలో వందకు పైగా కిలోమీటర్ల మేరకు ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు లైనింగ్ లేకపోవడంతో నీటిని విడుదల సమయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మూసీ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ.50కోట్లు కేటాయించడంతో చివరి ఆయకట్టుకు సైతం నీరందనుంది.
Similar News
News March 29, 2025
రోడ్ల మరమ్మతులకు రూ.600 కోట్లు

AP: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. ప్రాధాన్యతా క్రమంలో రాష్ట్ర, జిల్లా రోడ్లకు సంబంధించి 225 పనులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
News March 29, 2025
త్రిష ప్రేమ పెళ్లి చేసుకోనున్నారా?

41 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో అదరగొడుతున్న హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇవాళ ఆమె ఇన్స్టాలో నగలు, పట్టుచీరతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది’ అని రాసుకొచ్చారు. దీనికి సఖి చిత్రంలోని ‘స్నేహితుడా’ పాట BGMను యాడ్ చేశారు. దీంతో ఆమె ఫ్రెండ్ను ప్రేమ వివాహం చేసుకుంటున్నారా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News March 29, 2025
దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి కోరారు. ఉగాదిని వివిధ పేర్లతో దేశంలోని పలు రాష్ట్రాలు జరుపుకుంటాయి.