News March 6, 2025
‘ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి’

బాపట్ల జిల్లా ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక జరిగినట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొత్తపల్లి రమేష్ తెలిపారు. ఈ మేరకు నూతనంగా ఎంపికైన జిల్లా కార్యవర్గ సభ్యులతో కలెక్టర్ వెంకట మురళిని గురువారం బాపట్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. రమేశ్ మాట్లాడుతూ.. మీడియా రంగంలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
Similar News
News March 24, 2025
MMTSలో అత్యాచారయత్నం.. కిందకి దూకేసిన యువతి

హైదరాబాద్లో దారుణం జరిగింది. MMTS రైలులో ప్రయాణిస్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె రైలు నుంచి కిందకి దూకడంతో తీవ్రంగా గాయపడింది. యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. మహిళా బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
News March 24, 2025
మిస్ తెలుగు USA ఫైనలిస్ట్లో ఖమ్మం జిల్లా యువతి

మిస్ తెలుగు USA – 2025 పోటీల్లో బోనకల్ మం. ముష్టికుంట్లకు చెందిన యువతి గీతిక ఫైనల్స్కు చేరింది. అమెరికాలో స్థిరపడి చదువుకుంటున్న తెలుగు వారి కోసం ఈ పోటీలు నిర్వహిస్తారు. తెలుగుభాష గొప్పతనం, ఆత్మగౌరవం, సంస్కృతి తదితర అంశాలతో విజేతను ఎంపిక చేస్తారు. ఫినాలే మే25న డల్లాస్లో జరగనుండగా విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముష్టికుంట్లకు చెందిన శివనర్సింహారావు-మాధవి దంపతుల కుమార్తె గీతిక.
News March 24, 2025
నరసరావుపేట: సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు

వివిధ రకాల కార్పొరేషన్ కింద స్వయం ఉపాధి రుణాల దరఖాస్తు గడువు పెంచినట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. 2024-25 సంవత్సరంలో బీసీ, కాపు, ఈ బీసీ, తదితర అన్ని కార్పొరేషన్కి సంబంధించిన సబ్సిడీ రుణం మంజూరు కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. B.C, E.W.Sలో ఉన్న ఏడు కార్పొరేషన్ల లబ్ధిదారుల కోసం స్వయం ఉపాధి పథకాల నమోదు ప్రక్రియ ఈనెల 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.