News February 5, 2025
ఎస్సీ వర్గీకరణతో ఎవరికీ ఇబ్బంది ఉండదు: మంత్రి రాజనర్సింహా

ఎస్సీ వర్గీకరణతో ఎవరి ప్రయోజనాలకూ ఇబ్బంది కలగదని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 40ఏళ్ల కల నేడు సాకారం అవుతోందని అన్నారు. 30ఏళ్ల సమస్యకు నేడు పరిష్కారం దొరికిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో కొందరిలో భయం, అభద్రతాభావం ఉందన్న ఆయన వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని తెలిపారు.
Similar News
News January 16, 2026
హైదరాబాద్లో AQ @222

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున గాజులరామరంలో 222కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.
News January 16, 2026
నేడు ఆదిలాబాద్ జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10:30కి సీఎం నివాసం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్కు బయలుదేరనున్నారు. చనాక కొరటా పంప్ హౌస్ ప్రారంభించి నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొని, అనంతరం నిర్మల్ జిల్లాకు వెళ్లి సదర్మట్ బ్యారేజీ ప్రారంభించి నీటిని విడుదల చేసిన తర్వాత నిర్మల్ మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
News January 16, 2026
హైదరాబాద్లో AQ @222

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున గాజులరామరంలో 222కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.


