News July 28, 2024

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను BRS సరిగా ఖర్చు చేయలేదు: డిప్యూటీ సీఎం

image

BRS ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సరిగా ఖర్చు చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్సీ సబ్ ప్లాన్ రూ.33,124 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ రూ.17,056 కోట్లు, బీసీ సబ్ ప్లాన్‌కు రూ.10,028 కోట్లు, మైనార్టీల సబ్ ప్లాన్‌కు రూ.3,002 కోట్లు కేటాయించామని తెలిపారు.

Similar News

News February 27, 2026

ఖమ్మం: విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ‘వాట్సాప్‌’

image

విద్యుత్తు వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి 7901628348 నంబరుతో వాట్సాప్‌ చాట్‌ బాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ నంబరుకు ‘Hi’ అని పంపి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంప్లైంట్‌ ఐడీ ద్వారా సమస్య పరిష్కారాన్ని ట్రాక్ చేయవచ్చని, పారదర్శక సేవలే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

News February 27, 2026

ఖమ్మం: విద్యార్థుల్లో పెరుగుతున్న దృష్టి లోపాలు

image

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లాలో నిర్వహించిన కంటి పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సెల్‌ఫోన్ల వాడకం, పోషకాహార లోపంతో 42,277 మంది విద్యార్థులను పరీక్షించగా, 2,297మందిలో దృష్టి లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గుండె జబ్బులు, ఇతర శారీరక లోపాలున్న విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

News February 27, 2026

BREAKING.. డీజీపీ శివధర్ రెడ్డి ఖమ్మం పర్యటన రద్దు

image

డీజీపీ శివధర్ రెడ్డి నేటి ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.