News February 1, 2025
ఎస్సై ఆత్మహత్యతో నివ్వెరపోయిన స్వగ్రామం

అందరితో మంచిగా ఉండేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. ఏ కష్టమొచ్చిందో..ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో? అంటూ ఎస్ఐ సత్యనారాయణమూర్తి స్వగ్రామం కె.గంగవరం వాసులు నివ్వెరపోయారు. ప.గో.జిల్లా తణుకు ఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణమూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. దీంతో అతని కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. అతనికి భార్య విజయ, ఐదేళ్ల కొడుకు, 16 నెలల కూతురు ఉన్నారు.
Similar News
News February 18, 2025
BREAKING: కొత్త CECగా జ్ఞానేశ్ కుమార్

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జ్ఞానేశ్ కుమార్ పేరు గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతుండగా ఈరోజు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది.
News February 18, 2025
ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.
News February 18, 2025
కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

✓ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు✓ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మార్కెట్లో పత్తి ధర రూ.6,900✓ శంకరపట్నం మండలంలో తాగుడుకు బానిసై ఒక వ్యక్తి ఆత్మహత్య✓ ముస్లిం ఉద్యోగుల పని వేళల్లో మార్పులు✓ రామడుగు మండలంలో పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం✓ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో నేతలు