News March 19, 2025
ఎస్.అన్నవరం: రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత కుసనం దొరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున తుని రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఆయన స్వగ్రామం ఎస్.అన్నవరం వెళుతుండగా కుక్కలు అడ్డురావడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య ఎస్.అన్నవరంలో ఓ సెగ్మెంట్కి ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నారు.
Similar News
News October 26, 2025
SSC దరఖాస్తు సవరణ తేదీల్లో మార్పులు

SSC వివిధ పోస్టుల దరఖాస్తులో తప్పుల సవరణ తేదీలను ప్రకటించింది. కానిస్టేబుల్ (డ్రైవర్), హెడ్ కానిస్టేబుల్ (AWO) పోస్టులకు దరఖాస్తు సవరణ ఈనెల 31 – NOV 2వరకు చేసుకోవచ్చు. SI పోస్టులకు NOV 3 – 5 వరకు, HC (మినిస్టీరియల్) పోస్టులకు NOV 5 – 7 వరకు , కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు NOV 7 – 9 వరకు సవరణ చేసుకోవచ్చు. CHSL ఎగ్జామ్ స్లాట్ సిటీ, తేదీ, షిఫ్ట్ను ఈ నెల 28 వరకు ఎంపిక చేసుకోవచ్చు.
News October 26, 2025
ఎలాంటి ఎర పంటలను ఏ పంటల్లో వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు. ☛ క్యాబేజీలో సాధారణంగా వచ్చే డైమండ్ బ్యాక్ మాత్ను ఆవాలు పంటను వేసి నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ అలసంద పంటలో ఆవాలు ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.
News October 26, 2025
ADB: సీనియర్లు.. ర్యాగింగ్ భూతాలు

ర్యాగింగ్ భూతం విద్యార్థులను అవస్థల పాలుచేస్తోంది. తోటి విద్యార్థులతో స్నేహభావంగా మెలగాల్సిన సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గతంలో మేడ్చల్ జిల్లాలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ల వేధింపులు తాళలేక ఉట్నూర్కు చెందిన విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. తాజాగా ఖానాపూర్లో మరో ఘటన కలకలం రేపింది. వేధింపులకు పాల్పడే సీనియర్లపై ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


