News March 19, 2025

ఎస్.అన్నవరం: రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

image

తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత కుసనం దొరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున తుని రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఆయన స్వగ్రామం ఎస్.అన్నవరం వెళుతుండగా కుక్కలు అడ్డురావడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య ఎస్.అన్నవరంలో ఓ సెగ్మెంట్‌కి ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నారు.

Similar News

News April 23, 2025

VJA: యువతిని బెదిరించి బంగారంతో జంప్

image

యువతిని నమ్మించి వంచన చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసుల వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన యువతికి (25) ఓ డేటింగ్ యాప్‌లో అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ మంగళవారం కలుసుకున్నారు. యువతిని హోటల్ రూమ్‌కు తీసుకువెళ్లిన సదరు వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఉంగరాలు, సెల్ ఫోన్ తీసుకొని ఉడాయించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 23, 2025

ASF: ప్రత్యేక లోక్ అదాలత్‌పై 28న సమావేశం

image

జిల్లాలో జూన్ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణకు ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు ASF న్యాయస్థానం ఆవరణలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా న్యాయమూర్తి రమేవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

News April 23, 2025

జమ్ములో ఉగ్ర దాడి.. తీవ్రంగా ఖండించిన ఎంపీ

image

జమ్ము కశ్మీర్‌లో మంగళవారం టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరపడం తనను కలిచి వేసిందన్న ఆయన.. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. దేశ సరిహద్దులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

error: Content is protected !!