News March 2, 2025

ఎస్.కోటలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

ఎస్.కోటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. CI నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సీతంపేటకి చెందిన నాగభూషణం(58) ఎస్.కోట రైతు బజారు ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News October 26, 2025

VZM: 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు

image

మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశాలతో 27, 28, 29వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు RIO తవిటినాయుడు, ICDS పీడీ శాంతకుమారి తెలిపారు. అన్ని కళాశాలలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని సూచించారు. కాగా.. 3 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు <<18111583>>పాఠశాలలకు<<>> సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 26, 2025

VZM: మూడు రోజులు పాఠశాలలకు సెలవు

image

మొంథా తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27, 28, 29వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు DEO మాణిక్యం నాయుడు తెలిపారు. అన్ని పాఠశాలలు పూర్తిగా మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు విద్యార్థులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News October 26, 2025

మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్

image

మోంథా తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఫోన్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. తుఫాను ప్రభావం కారణంగా ఏ పరిస్థితి వచ్చినా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.