News December 21, 2024
ఎస్ కోటలో స్కూళ్లకు సెలవులు

తుఫాన్ నేపథ్యంలో ఎస్. కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ఎంఈవో నర్సింగరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. కాగా ముందస్తు సమాచారం లేకపోవడంతో శనివారం పాఠశాలలకు యథావిధిగా వెళ్లిన విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు. మరి మీ మండలంలో సెలవు ప్రకటించారా ? కామెంట్ చేయండి.
Similar News
News November 18, 2025
మెరకముడిదాం : ఉపాధ్యాయుడుని సత్కరించిన విజయనగరం ఎంపి

మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మరడాన సత్యారావుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం సత్కరించారు. 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను పదవతరగతి విద్యార్థులను విమానం ఎక్కించినందుకు సత్యారావుని ఎంపి అభినందించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను విమానం ఎక్కిస్తానని సత్యారావు తెలిపారు.
News November 18, 2025
‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
News November 18, 2025
‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.


