News May 19, 2024
ఎస్.కోట: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన అప్పలస్వామి అనే గొర్రెల కాపరి ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఎప్పటిలాగే తన మేకలను మేపేందుకు గ్రామ సమీపంలో మెట్టకు వెళ్లాడు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినప్పటికీ అప్పలస్వామి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెతికారు. ఈ నేపథ్యంలో అప్పలస్వామి గ్రామ సమీపంలో పిడుగు పడి మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తీవ్రంగా రోదిస్తూ వెల్లడించారు.
Similar News
News April 23, 2025
ఈనెల 30న పాలిసెట్ పరీక్ష: DRO

ఈ నెల 30న పాలిసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని DRO శ్రీనివాస మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్లో పరీక్ష నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 8,083 మంది అభ్యర్థులు 23 కేంద్రాల్లో హాజరు కానున్నారని తెలిపారు. విజయనగరంలో 9 కేంద్రాలు, బొబ్బిలిలో 6 కేంద్రాలు, గజపతినగరంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
News April 23, 2025
VZM: నేడే పది ఫలితాలు.. ఒక్క క్లిక్తో..!

బుధవారం ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్తో వే2న్యూస్లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it
News April 22, 2025
సివిల్స్లో 830వ ర్యాంక్ సాధించిన రాజాం యువకుడు

రాజాం మండలం సారధికి చెందిన వావిలపల్లి భార్గవ మంగళవారం విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 830వ ర్యాంక్ సాధించారు. నాలుగుసార్లు UPSC ఇంటర్వ్యూల వరకు వెళ్లి విఫలమైయారు. 5వ ప్రయత్నంలో సివిల్స్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో పిడుగురాళ్ల సర్కిల్ కమిషనర్గా భార్గవ పనిచేస్తున్నారు. ఇయన తండ్రి విష్ణు ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.