News September 16, 2024
ఎస్.కోట: మద్యం మత్తులో వ్యక్తి సజీవ దహనం

ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామంలో ఓ వృద్ధుడు ఆదివారం సజీవదహనమయ్యాడు. రాత్రి వినాయక నిమజ్జనంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెంట నాగు(74) మద్యం తాగి సిగరెట్ వెలిగించాడు. ఈ క్రమంలో సిగరెట్ నిప్పు అంటుకోవడంతో మంచంతో పాటు ఆయన సజీవ దహనమయ్యాడు. ఇంట్లో ఉన్న భార్య కేకలు వేసినా ఫలితం లేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 10, 2025
విజయనగరం: మా జీతాలు ఇవ్వండి సార్..!

విజయనగరం జిల్లాలో ఆర్ అండ్ బీ, జలవనరులు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ సహా ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగస్థులకు 10వ తేదీ వచ్చినా కూడా ప్రభుత్వం జీతాలు వేయలేదని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎల్వీ యుగంధర్ని ఏపీసిపిఎస్ఈఏ సభ్యులు కలిసి సమస్యను విన్నవించుకున్నారు. ఈ విషయంపై ఎస్టీఓ అమరావతి అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
News December 10, 2025
VZM: దుకాణాల్లో పండగ ఆఫర్లు

క్రిస్మస్, సంక్రాంతి పంగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి RV మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, MG రోడ్డు, పూల్భాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు.
News December 10, 2025
VZM: ‘గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరు’

జిల్లాలో గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మొత్తం 67 పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. బొబ్బిలి-8, చీపురుపల్లి-10, గజపతినగరం-7, నెల్లిమర్ల-17, రాజాం-6, ఎస్.కోట-7, విజయనగరం-12 పనులకు ఆమోదం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.


