News March 6, 2025

ఎస్.రాయవరం: యువకుల ప్రాణం తీసిన అతివేగం..!

image

రైల్వే న్యూకాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి గోపి కుమారుడు యశ్వంత్(21), గొడుగు అచ్చిరాజు కొడుకు సాయికుమార్(20) <<15656341>>మృతి చెందారు<<>>. యశ్వంత్ కుటుంబం బతుకుతెరువు కోసం ఎస్.రాయవరం నుంచి నగరానికి వలస వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 స్పీడ్‌లో నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Similar News

News February 28, 2026

Don’t miss: నేడు బాలికలకు ఫ్రీగా HPV టీకా

image

సర్వైకల్ క్యాన్సర్ కేసుల కట్టడే లక్ష్యంగా ఇవాళ 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్ జరగనుంది. PM మోదీ రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో జాతీయస్థాయి టీకా కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. APలో CM CBN రావివలస(విజయనగరం)లో, TGలో మంత్రి రాజనర్సింహ HYD కోఠిలో ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6.75L మందికి పంపిణీ చేస్తారు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.
#ShareIt

News February 28, 2026

వర్కవుట్స్ అంటే చిరాకా? ఈ టిప్స్‌తో ఫిట్‌‌గా ఉండొచ్చు..!

image

జిమ్‌లో కష్టపడటం ఇష్టం లేనివారు ఫిట్‌గా ఉండేందుకు సింపుల్ టిప్స్ ఉన్నాయి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం ద్వారా డైలీ మూవ్‌మెంట్ పెంచాలి. నచ్చిన డాన్స్, స్విమ్మింగ్ వంటి పనులతో యాక్టివ్‌గా ఉంటూ రోజుకు 10వేల అడుగుల గోల్ పెట్టుకోవాలి. ఇంట్లోనే సింపుల్ పుష్-అప్స్, ఫ్రెండ్స్‌తో కలిసి వాకింగ్ చేస్తే బోర్ కొట్టదు. ప్రొటీన్, ఫైబర్ ఉన్న డైట్ తీసుకుంటే జిమ్‌కు వెళ్లకున్నా ఫిట్‌గా ఉండొచ్చు.

News February 28, 2026

అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

image

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.