News May 24, 2024

ఏఆర్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం.. మూడేళ్ల జైలు

image

ఏఆర్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసులో పవన్, సత్య భవానీశంకరానికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 ఫైన్ విధిస్తూ కాకినాడ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి విజయబాబు గురువారం తీర్పునిచ్చారు. 2020లో కొండయ్యపాలానికి చెందిన సుబ్రహ్మణ్యం, పవన్, సత్య భవానీశంకరం అదే ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ బాలారెడ్డిపై చాక్‌తో దాడి చేశారు. టూ టౌన్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. మూడో నిందితుడు సుబ్రహ్మణ్యం మృతి చెందాడు.

Similar News

News November 11, 2025

తూ.గో జిల్లాలో 8,773 ఇళ్ల నిర్మాణం పూర్తి

image

తూ.గో జిల్లాలో 8,773 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్(PD) నాతి బుజ్జి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గృహప్రవేశాలు చేస్తారని చెప్పారు. అన్ని నియోజక వర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో గృహప్రవేశాలు వేడుకగా నిర్వహిస్తామన్నారు. గోకవరం మండలం కామరాజుపేటలో జరిగే కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతారన్నారు.

News November 11, 2025

తూ.గో జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారిగా శ్రీదేవి

image

తూ.గో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా డాక్టర్ బి.శ్రీదేవి నియమితులయ్యారు. ఈ మేరకు DMHO కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె DMHO కె.వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అలాగే డిప్యూటీ డెమోగా పి.సత్యవతి బాధ్యతలు స్వీకరించారు.

News November 11, 2025

తూ.గో: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

image

తూ.గో జిల్లాలో 2026లో జరిగే SSC/OSSC/వొకేషనల్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు నోటిఫికేషన్ విడుదలైందని DEO కె.వాసుదేవరావు తెలిపారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన విద్యార్థుల ఫీజు చెల్లింపు షెడ్యూల్ HMలకు పంపామన్నారు. ఈనెల 13 నుంచి 25వ తేదీలోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు కట్టవచ్చన్నారు. రూ.50 ఫైన్‌తో 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 11వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 15లోపు చెల్లించాలన్నారు.