News September 12, 2024

ఏచూరి మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

image

సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిరుపేదల పక్షపాతిగా ప్రజల కోసం పోరాడిన గొప్ప ప్రజాపోరాట యోధుడిని ఈ దేశం కోల్పోయిందన్నారు. విలువలు,సిద్ధాంతాల కోసం తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారం ఏచూరి ఆదర్శప్రాయులని తెలిపారు.ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

Similar News

News February 24, 2026

NLG: సొంతింటి కల.. పాలకుల మాయాజాలం!

image

రాజకీయ చదరంగంలో పేదల సొంతింటి కల కేవలం ఓటు బ్యాంకు పావుగా మారుతోంది. ఎన్నికల వేళ హామీల వర్షం కురిపిస్తున్న పాలకులు, తీరా గెలిచాక ఆ ఇళ్లను గాలికొదిలేస్తున్నారు. నల్గొండలో కోట్ల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలు నేడు పాలకుల నిర్లక్ష్యంతో పాడుబడుతున్నాయి. చూడ్డానికి కోటలా ఉన్నా, నివసించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులకు అందక ఈ ఇళ్లు నేడు శిథిలావస్థకు చేరుతున్నాయి.

News February 24, 2026

NLG: గృహలక్ష్మి లబ్ధిదారులకు ‘ఇందిరమ్మ’ ఊరట

image

గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద బేస్‌మెంట్ స్థాయి వరకు ఇళ్లు నిర్మించుకుని, నిధులు అందక నిలిచిపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరిని ఇందిరమ్మ ఇళ్ల పథకంలోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. బేస్‌మెంట్ వరకు కట్టిన వారికి లక్ష రూపాయలు మినహాయించి, మిగిలిన నాలుగు లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది.నల్గొండ జిల్లాలో 150 మందికి ఈ అవకాశం కల్పించారు.

News February 24, 2026

NLG: రైస్ మిల్లర్లపై పోలీసు కేసుల కలకలం!

image

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్పడిన పలువురు మిల్లర్లపై రెండు రోజుల నుంచి వరుసగా కేసులు నమోదు చేయించడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బియ్యం మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెనువెంటనే ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.